కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలం ఎర్రపాడు లోని పోలింగ్ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జనవరి ఒకటి 2023 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటర్ నమోదు కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. బూతులెవల్ అధికారులతో మాట్లాడారు. మృతి చెందిన వారి …
Read More »కామారెడ్డిలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగం పీఠికను ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. …
Read More »సీఎం సహాయనిధి చెక్కులు అందజేత
రెంజల్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామ సర్పంచ్ వికార్ పాషా చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వికార్ పాషా మాట్లాడుతూ 14 వేల విలువగల సీఎం సహాయనిధి చెక్కును లబ్ధిదారుడు గంగాధర్కు అందజేసినట్లు సర్పంచ్ అన్నారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, …
Read More »ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
రెంజల్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో 73వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెంజల్, సాటాపూర్, తాడ్ బిలోలి, నీలా, దూపల్లి, బాగేపల్లి, కునేపల్లి గ్రామాల్లో సర్పంచ్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం రచించి 73 యేళ్లు పూర్తి అయిన సందర్భంగా రాజ్యాంగం గొప్ప తనాన్ని వివరించారు. పాఠశాలలో విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు …
Read More »అందరికి సముచిత న్యాయం… వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరంగల్లో రాహుల్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం కామారెడ్డిలోని నరసన్నపల్లి, పాతరాజంపేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్ కార్యకర్తలకు సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత …
Read More »ఈద్గా నిర్మాణ పనులు ప్రారంభం
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి శివారులో గల ఈద్గా పనులను 35, 12వ వార్డ్ కౌన్సిలర్లు ప్రారంభించారు. ఈద్గా నిర్మాణానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్కు వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి శివారులో ఈద్గా నిర్మాణ పనులను 12, 35 వార్డ్ కౌన్సిలర్లు …
Read More »18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు శనివారం, రేపు ఆదివారం తిరిగి డిసెంబర్ 3,4 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2023 లో భాగంగా ఈ 26, 27, డిసెంబర్ 3, 4 తేదీలలో నిర్వహించే ప్రత్యేక క్యాంపేయిన్లో 18 …
Read More »లక్ష్యాలు చేరడానికి బ్యాంకర్లు కృషి చేయాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశించిన లక్ష్యాలను చేరడానికి బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం 2022-23 సెప్టెంబర్ అర్ధ సంవత్సర బ్యాంకుల రుణ వితరణ, పనితీరు పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2022-23 లో నిర్దేశించుకున్న వార్షిక సంవత్సరంలో రూ.4700 …
Read More »ఎమ్మెల్యే చొరవతో ఐక్యతా రాగం
ఆర్మూర్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ క్షత్రియ సమాజ్ (పట్కరి) ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ప్రతిష్టంభన ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి చొరవతో తొలగిపోయింది. క్షత్రియ సమాజ్లోని రెండు వర్గాలు వైరుధ్యాలను పక్కనపెట్టి ఇక ముందు కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఐక్యతారాగం ఆలపించాయి. వివరాల్లోకి వెళ్ళితే… ఆర్మూర్ పట్టణ క్షత్రియ సమాజ్కు జరిగిన ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన రెడ్డి ప్రకాష్, …
Read More »భూంపల్లి పెద్ద చెరువులో చేపపిల్లల విడుదల
సదాశివనగర్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలోని పెద్ద చెరువులో శుక్రవారం స్థానిక ఎం.పి.పి గైని అనసూయ, స్థానిక సర్పంచ్ లలిత, మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వర్ రావు, స్థానిక సింగల్ విండో చైర్మన్ టి గంగాధర్, గ్రామ ఉపసర్పంచ్ సాయిలు కలిసి 27 వేల చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని …
Read More »