హైదరాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య ఇటీవల బహరేన్లో మరణించారు. శనివారం, (22.10.2022) బహరేన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జెఏసి నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం, గన్ పార్క్ వద్ద శవపేటిక ను ఉంచి నివాళులు అర్పించారు. అరుణోదయ సాంస్కృతిక బృందం …
Read More »కామారెడ్డిలో కొమురం భీం జయంతి
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డిలోని ఆర్కే జూనియర్ కళాశాలలో స్వాతంత్య్ర సమరయోధుడు, గోండు జాతి నాయకుడు కొమురం భీం జయంతి నిర్వహించారు. భీం పోరాట పటిమను కొనియాడారు. అనంతరం ఉత్తమ విద్యార్థులను అభినందించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి షేక్ సలాం విచ్చేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల …
Read More »పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యం
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. సమాజాన్ని నేర రహితంగా …
Read More »68వ సారి రక్తదానం చేసిన బాలు
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్విఆర్ వైద్యశాలలో పట్టణానికి చెందిన జీవన జ్యోతి (35)కు డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో ప్లేట్లేట్ల సంఖ్య తగ్గిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. అర్ధరాత్రి వేళ అయినా వెంటనే స్పందించి 68వ సారి సకాలంలో …
Read More »సైబర్ నేరాలపై నేడు అవగాహన కార్యక్రమం
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతోపాటు సైబర్ నేరగాళ్లం చేతుల్లో మోసపోయిన బాధితులకు ఏ విధమైన సహకారం అందించడం జరుగుతుందో, సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ విభాగం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసేందుకుగాను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రేపు అనగా 21వ తేదీ …
Read More »టియు ఫలితాలలో సత్తా చాటిన ఆర్.కె. విద్యార్థులు
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ప్రకటించిన తెలంగాణ యునివర్సిటీ ఫలితాలలో ఆర్.కె. విద్యార్థులు 10/10 జిపిఎస్ సాధించి ప్రభంజనం సృష్టించారు. ఎప్పటిలాగే ఈ ఫలితాల్లో కూడా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 10/10 జిపిఎ సాధించారు. ఈ సందర్భంగా ఆర్.కె. కళాశాల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆర్.కె. విద్యార్థులు ఎంపీసీఎస్ విద్యార్థి బి. శ్రీనాథ్ రెడ్డి 10/10 జీపీఏ మరియు …
Read More »నవంబర్ 14 నుంచి 18 వరకు వేలంపాట
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ లోని ప్లాట్లు, గృహాలను వ్యక్తులు వేలంపాట ద్వారా సొంతం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఫ్రీ బిడ్ సమావేశానికి హాజరై మాట్లాడారు. నవంబర్ 14 నుంచి 18 వరకు వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వ్యక్తులు కలెక్టర్ కామారెడ్డి పేరున రూ.10 వేలు …
Read More »గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న లక్ష్మి (25) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల అండ్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దోమకొండ మండల కేంద్రానికి చెందిన రవికి తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా …
Read More »యువకుని ఆత్మహత్య యత్నం
ఎడపల్లి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ధిక పరిస్తితులు బాగాలేక ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికులు, పోలీసులు కాపాడిన ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి గ్రామానికి చెందిన శివాజీ అనే 26 ఏండ్ల యువకుడు ఆర్ధిక ఇబ్బందులతో బుధవారం ఎడపల్లి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇది …
Read More »తెలంగాణలో చిత్తశుద్ధి లేని పాలన కొనసాగుతుంది
డిచ్పల్లి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో చిత్తశుద్ధి లేని పాలన కొనసాగుతుందని, వైయస్ఆర్ టిటీ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల అన్నారు. బుధవారం డిచ్పల్లి మండలం బాలానగర్ క్యాంప్ నుంచి మొదలైన పాదయాత్ర డిచ్పల్లి రైల్వే స్టేషన్ మార్కెట్ స్థలంలో వైయస్ఆర్ టిపి కార్యకర్తలు, నాయకులు, మహిళలతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం …
Read More »