Constituency News

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పై అవగాహన

ఎడపల్లి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థి దశ నుండి విద్యార్థుల్లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించాలని ఇస్రో శాస్త్రవేత్త శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఇస్రో ఫేస్‌ వీక్‌లో భాగంగా ఎడపల్లి గురుకుల పాఠశాలలో పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు ఇస్రో ప్రయోగాల గురించి వివరించారు. విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉద్యోగాలపైన ఆధారపడకుండా సైన్స్‌ అండ్‌ …

Read More »

పంటల మార్పిడి వల్ల ఏమవుతుందో తెలుసా?

కామారెడ్డి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఏటా ఒకే రకం పంటను సాగు చేయడం వల్ల నేలలో పోషకాల స్థాయి తగ్గుతుందని జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో(ఆత్మ) మహిళా కిసాన్‌ దివస్‌ పురస్కరించుకొని శనివారం గ్రామీణ ప్రాంతాల రైతులకు చిరుధాన్యాల సాగు, పోషణ విలువల ఆవశ్యకతపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. …

Read More »

స్థల వివాదాన్ని పరిష్కరించిన ఆర్డీవో

రెంజల్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో గత కొంతకాలంగా వివాదాస్పదమైన చత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు స్థల సమస్యను ఎట్టకేలకే బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌ శుక్రవారం పరిష్కరించారు. ఆర్టీసీ అధికారులు, గ్రామస్తులకు గత నాలుగు నెలలుగా స్థల సమస్యతో అగాధం పెరిగిపోయింది. చివరికి ఆర్టీసీ అధికారులు గ్రామస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు. విషయాన్ని స్థానిక సర్పంచ్‌ మర్లషికారి …

Read More »

మనఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

రెంజల్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో ఈ నెల 28 నుండి నవంబర్‌ 30 వరకు చేపడుతున్న మనఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని పల్లెపల్లెకు వివరించేందుకు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షకీల్‌ చేపట్టడం జరిగిందని కార్యక్రమంలో …

Read More »

డిసెంబరులో జాతీయ సదస్సు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 9 డిసెంబర్‌ 2022 న జరగబోయే జాతీయ సదస్సుకు సంబంధించిన కరపత్రంను శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ రవీందర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్థశాస్త్ర విభాగ అధిపతి, జాతీయ సదస్సు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి. నారాయణ మాట్లాడుతూ ‘‘భారతదేశ వ్యవసాయ రంగం యొక్క పర్యావలోకనం మరియు అవకాశాలు’’ అనే అంశంపై …

Read More »

నేడు ప్రపంచ ఆహార దినోత్సవం

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేదలకు రేషన్‌, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యాన్ని పంపిణీ చేసి ఆహార భద్రత కల్పిస్తున్నాయని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »

రెండు గంటల ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రూప్‌ -1 ప్రాథమిక పరీక్ష ఇన్విజిలేటర్లను లాటరీ విధానంలో ఎంపిక చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం అధికారులతో గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌ 16న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతోందని తెలిపారు. అభ్యర్థులు రెండు గంటల …

Read More »

వివిధ పంటలకు మద్దతు ధరలు ఇలా…

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యత ప్రమాణాలు పాటించి పత్తిని రైతులు జిన్నింగ్‌ మిల్లులకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం జిన్నింగ్‌ మిల్లులో యజమానులతో, మార్కెటింగ్‌, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మద్దునూరులో పత్తి కొనుగోలు కోసం 8 జిన్నింగ్‌ మిల్లులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మిల్లుల …

Read More »

విధుల్లో చేరిన వీఆర్‌ఏలు

ఎడపల్లి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల సాధన కోసం 80 రోజులుగా సమ్మెలో ఉన్న వీఆర్‌ఏలు సమ్మెను విరమించారు. ఈ మేరకు విధుల్లో చేరుతున్నట్లు ఎడపల్లి మండల వీఆర్‌ఏ లు తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వీఆర్‌ఏల మండల అధ్యక్షుడు కుంట ఆబ్బయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్‌ఏ జేఏసీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, వీఆర్‌ఏల డిమాండ్లకు సీఎస్‌ …

Read More »

నీటి ఎద్దడి లేకుండా చూడాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా మిషన్‌ భగీరథ, మున్సిపల్‌ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం మున్సిపల్‌, మిషన్‌ భగీరథ అధికారులతో పట్టణంలో నీటి ఎద్దడి పై సమీక్ష నిర్వహించారు. ఇందల్వాయి నుంచి కామారెడ్డి వరకు ఉన్న మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ కు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »