కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలు నాటి భావితరాలకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ధరణి టౌన్షిప్లో ఆదివారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనం నాటిన మొక్కలు భవిష్యత్తు తరాలకు నీడను, పండ్లు, ప్రాణవాయువును అందిస్తాయని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక …
Read More »సిసి రోడ్డు పనులు ప్రారంభం
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 47వ వార్డ్ లో ఎస్డిఎఫ్ 5 లక్షల నిధులతో అభివృద్ది పనులలో భాగంగా కమ్మరి గల్లి, కుంబాల గల్లి, కాకర్ల గల్లిలో సిసి రోడ్ పనులను 47వ వార్డ్ కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ అధ్వర్యంలో ఎంఎల్ఏ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహకారంతో, ఎంకె ముజీబొద్దీన్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిట్టు …
Read More »22 నుండి 26 వరకు వేలం
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లోని ప్లాట్లు, వివిధ దశలో ఉన్న గృహాలు, పూర్తయిన గృహాలకు ఈనెల 22 నుంచి 26 వరకు కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆదివారం ఆయన ధరణి టౌన్షిప్లో ఉన్న ప్లాట్లను, గృహాలను పరిశీలించారు. వేలంలో పాల్గొనేవారు పదివేల రూపాయలు ఈఎండి చెల్లించాలని సూచించారు. 30 …
Read More »యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగ ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని భవిత పాఠశాలలో ఆదివారం యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. యోగ చేయడం వల్ల ఆనందం, మానసిక ఉల్లాసం కలుగుతోందని సూచించారు. మాచారెడ్డి కేజీబీవీ …
Read More »వైభవంగా సాగిన జగన్నాథ రథయాత్ర
నందిపేట్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రంలో జగన్నాథ రథయాత్ర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ‘జై జగన్నాథ.. జైజై జగన్నాథ’ అంటూ భక్తులు స్వామివారికి స్వాగతం పలికారు. కేదారేశ్వర ఆశ్రమం వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ మీదుగా వెళ్లి పుర వీధుల్లో కనువిందు చేసిన యాత్ర నాగమంతెన కళ్యాణమండపం దగ్గర ముగిసింది. భక్తులతో …
Read More »ఉచిత విద్యాపథకాన్ని ప్రవేశపెట్టిన మహానాయకుడు రాజీవ్గాంధీ
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ జన్మ దినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశం కోసం తన …
Read More »ప్రతి మూడునెలలకోసారి రక్తదానం
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గీరెడ్డి రవీందర్ రెడ్డి వైద్యశాలలో డిచ్పల్లి మండలం సిర్నాపల్లి గ్రామానికి చెందిన రాజన్న (70) కు ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన వ్యాపారి మందుల సంతోష్కు తెలియజేయగాని వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారని, రెడ్ క్రాస్ అండ్ ఐవిఎఫ్ జిల్లా …
Read More »రంగోళీ పోటీ విజేతలకు బహుమతుల పద్రానం
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్, కళాభారతి ఆవరణలో శనివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రధానం చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమరయోధుల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. స్వతంత్ర …
Read More »బాలశ్రీనివాస మూర్తికి ధర్మనిధి పురస్కారం
డిచ్పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ సాహిత్య పరిశోధకులు, విమర్శకులు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తికి 2022 సంవత్సరానికి గాను డా. తిరుమల శ్రీనివాసాచార్య – స్వరాజ్యలక్ష్మి ధర్మనిధి పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ కవి డా. తిరుమల శ్రీనివాసాచార్య ఏర్పాటు చేసిన ఈ పురస్కారానికి సాహితీ రంగంలో విశేష సేవలు అందిస్తున్నందుకు డా. జి. …
Read More »చిట్ఫండ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని బాధితుని ఫిర్యాదు
బోధన్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ ప ట్టణంలో ఓ ప్రయివేటు చిట్ఫండ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు శుక్రవారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చిట్ఫండ్ కంపెనీ గత 48 నెలలుగా చిట్టి డబ్బులు లక్ష 92 వేల రూపాయలు కట్టించుకొని తమకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా గత కొన్ని నెలలుగా సతాయిస్తున్నాడంటూ బాధితుడు వాపోయాడు. వెంటనే చిట్ఫండ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని …
Read More »