Constituency News

మొక్కలు సంరక్షిస్తే భావితరాలకు ప్రాణవాయువు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కలను సంరక్షిస్తే భావితరాలకు ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 15 వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్‌ పార్క్‌ ఏర్పాటు చేశారు. పార్కులో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కాలనీవాసులు పార్కులో నాటిన మొక్కలను ప్రతి కుటుంబం రెండు చొప్పున దత్తత …

Read More »

గాంధీ స్ఫూర్తిని కెసిఆర్‌ కొనసాగించారు…

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహింస మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గాంధీజీ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని తెలిపారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా …

Read More »

బస్తీ దవాఖాన ప్రారంభించిన మంత్రి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం బస్తి దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ వాడలో మంగళవారం బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాస్థాయిలో మొదటి బస్తి దవాఖానాను కామారెడ్డిలో ఏర్పాటు చేసినట్లు …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం చేసిన డాక్టర్‌ వేద ప్రకాష్‌

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ కేంద్రానికి చెందిన లక్ష్మీ (35) కి గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఏ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం బాన్సువాడ రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారు ఐవిఎఫ్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేదప్రకాష్‌కు తెలియజేయడంతో వెంటనే స్పందించి తన జన్మదినం …

Read More »

ఘనంగా యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ షబ్బీర్‌ అలీ ఆదేశాల మేరకు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి సూచన మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో యువజన కాంగ్రెస్‌ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్థానిక రైల్వే స్టేషన్‌ వద్ద పేదలకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

కామారెడ్డిలో గాంధీ చిత్రప్రదర్శన

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రిచర్డ్‌ అటెన్‌ తెరకెక్కించిన గాంధీ చిత్రాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు. కామారెడ్డి పట్టణంలోని 4 థియేటర్లలో మంగళవారం ఉచిత సినిమా ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులను బస్సులలో థియేటర్ల వద్దకు తీసుకువచ్చి సినిమాను చూపించారు. ప్రియా ఏషియన్‌ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించి, సినిమా చూడడానికి వచ్చిన …

Read More »

ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

హైదరాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీయూసీ చైర్మన్‌, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఖండిరచారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి, జీవన్‌ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపి పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని శాఖల …

Read More »

వలకు చిక్కిన కొండ చిలువ

ఎడపల్లి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం పోచారం గ్రామంలోని చెరువులో భారీ కొండ చిలువ వలకు చిక్కగా స్థానికులు పట్టుకొని ఫారెస్టు అధికారులకు అప్పగించారు. అడవుల్లో సంచరించాల్సిన కొండ చిలువ చేపల కోసం వేసిన వలకు చిక్కడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం… ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పోచారం శివారులోని చెరువులో చేపలు క్రింది ప్రాంతం వెళ్లకుండా అలుగు …

Read More »

తెలంగాణ యూనివర్సిటీ టాప్‌ర్యాంకులో నిలవాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్‌ (చాన్స్‌లర్‌) డా. తమిళి సై సౌందర రాజన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు. మొదట పరిపాలనా భవనానికి విచ్చేసిన గవర్నర్‌కు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌, అదనపు కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ స్వాగతం పలికి ఆహ్వానించారు. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) కో – ఆర్డినేటర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »