Constituency News

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 29 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 22 లక్షల 61 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,482 మందికి 9 కోట్ల 25 లక్షల 61 వేల 300 …

Read More »

భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం

బోధ‌న్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, రానున్న ఎన్నికల్లో బోధన్‌ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురకడం ఖాయమని బోధన్‌ నియోజకవర్గ భాజపా ఇంచార్జ్‌ మేడపాటి ప్రకాష్‌ రెడ్డి అన్నారు. గురువారం బోధన్‌ పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహించిన …

Read More »

స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా వజ్రోత్సవాలు

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులకు సూచించారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలన్నారు. గురువారం భారతస్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టరేట్‌ నుండి అన్ని …

Read More »

బిల్లులు రాలేదని సర్పంచ్‌ భర్త ఆత్మహత్య

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ధి చేయాలని గ్రామ సర్పంచ్‌ భర్త అప్పులతో అభివృద్ధి చేసి ఇబ్బందుల్లో పడ్డారు. చేసిన పనులకు బిల్లులు రాక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్వంత మండలం వేల్పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం పడిగెల వడ్డెర కాలనీ సర్పంచ్‌ బలవన్మరణం పొందాడు. …

Read More »

ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను అదేశించారు. గురువారం ఐడివోసిలోని జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో కొత్తగా నియామకమైన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో డిపిఆర్‌వో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నిర్దేశిత …

Read More »

ధాన్యం మిల్లింగ్‌ వేగవంతం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్లు ధాన్యం మిల్లింగ్‌ వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల రైస్‌ మిల్లర్లతో ధాన్యం మిల్లింగ్‌ పై సమీక్ష నిర్వహించారు. మిల్లుల వారిగానే మిల్లింగ్‌ చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. డిప్యూటీ తాసిల్దార్లు రైస్‌ మిల్లులను …

Read More »

విఆర్‌ఏలవి న్యాయమైన కోరికలు

నందిపేట్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విఆర్‌ఏలవి న్యాయమైన కోరికలు అని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బీజేపీ నాయకులు కంచెట్టిగంగాధర్‌, బిజెపి నందిపేట్‌ మండల ఇన్చార్జి స్రవంతి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విదంగా పేస్కెల్‌ వెంటనే అమలు చేసి వారి కోరికలను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విఆర్‌ఏల దీక్షలో భాగంగా గురువారం నందిపేట్‌ మండల భారతీయ …

Read More »

రుణ లక్ష్యాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ లోని మీటింగ్‌ హాలులో ఐకెపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్త్రీ నిధి రుణాలు అర్హత గల సంఘాలకు ఇప్పించాలని సూచించారు. గ్రామ సంఘాలను ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా చూడాలన్నారు. మండల సమైక్యల ద్వారా వ్యాపారాలు చేపట్టి లాభాలు సాధించే …

Read More »

గర్భిణీ స్త్రీకి సకాలంలో రక్తం అందజేత

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా కూచన్‌పల్లి గ్రామానికి చెందిన నవ్య (26) గర్భిణీకి అత్యవసరంగా ఏబీ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం మెదక్‌ జిల్లా కేంద్రంలో లభించకపోవడంతో వారు ఐవిఎఫ్‌ రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన నాగిర్తి రమేష్‌ సహకారంతో రెండు …

Read More »

ప్రణాళికతో చదివితే విజయం మీదే

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళికతో చదివితే విజయం మీదే అవుతుందని, పట్టుదలతో ఇష్టపడి చదవాలని, అంకిత భావంతో చదువుతేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి మందిరంలో బుధవారం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మార్గ నిర్దేశం చేశారు. ఉద్యోగ సాధనలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »