Constituency News

సోమవారం ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. బోనాల పండుగ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. జిల్లా ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు.

Read More »

వాహనాల చోరీ.. నిందితుడి అరెస్టు

ఆర్మూర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోటర్‌ సైకిళ్లను చోరీ చేస్తున్న పెర్కిట్‌కు చెందిన మహ్మద్‌ వాహీద్‌ అలీ (19) అనే దొంగను అరెస్టు చేసి పది మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. ఆర్మూర్‌ పట్టణంలోని సిద్దులగుట్ట వెనక గల దోబీఘాట్‌ వద్ద 63వ జాతీయ రహదారిపై …

Read More »

కొత్త మండలాలు ఇవే…

హైదరాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాలనాసంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు దార్శనికతతో ఇప్పటికే నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు …

Read More »

సిపిఐ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలి

బోధన్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులను దేశం అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్న సమయంలో ప్రజా ఉద్యమమే ఏకైక మార్గమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. సుధాకర్‌ పిలుపునిచ్చారు. అదే స్థాయిలో సిపిఐ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. శనివారం కోటగిరి మండల సిపిఐ మహాసభ కోటగిరిలోని గీతా పారిశ్రామిక సహకార సంఘ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా …

Read More »

మార్కెట్లోకి స్వచ్చమైన తేనె ఉత్పత్తులు

హైదరాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల నుండి నేరుగా గిరిజనులు సేకరించిన పుట్టు తేనెను, ఏ మాత్రం రసాయనాలతో ప్రాసెస్‌ చేయకుండా నేరుగా స్వచ్ఛమైన తేనే విక్రయాలను ‘‘గిరి నేచర్‌’’ అనే పేరుతొ తెలంగాణా గిరిజన సహకార సంస్థ ప్రారంభించింది. గిరిజన స్వచ్ఛమైన తేనే ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ …

Read More »

పరస్పర ఆలోచనలతోనే సమర్థవంతమైన పరిశోధనలు

హైదరాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్దిష్ట శాస్త్రీయ సవాళ్లను పరిష్కరించడానికి జన్యుశాస్త్రంలోని వివిధ విభాగాలతో వినూత్న రీతిలో సమీకృత పరిశోధనలు జరపాలని ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్‌ డాక్టర్‌ డి. శ్రీనివాస్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘సమీకృత జీవశాస్త్రం అనువర్తిత జన్యుశాస్త్రం’’ పై ఓయూ ఠాగూర్‌ ఆడిటోరియంలో మూడు రోజులుగా జరుగుతున్న రెండో అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. …

Read More »

టీయూలో ఘనంగా జాతీయ సిపిఆర్‌ దినోత్సవం

డిచ్‌పల్లి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం మరియు ఇందూరు అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్‌ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సిపిఆర్‌ (కార్డియో పల్ననరీ రీ సస్టేషన్‌) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూరు అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శ్రీశైలం మాట్లాడుతూ అన్నింటిల్లో కెల్లా ప్రాణాలను కాపాడడమే ఉత్తమమని అన్నారు. ఆపద సమయంలో తోటివారిని ఎలా కాపాడవచ్చో …

Read More »

రోడ్లు తక్షణమే మరమ్మతు చేయించాలి

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీ వీల్‌ ట్రాక్టర్లు రోడ్లపై నడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్‌ శోభ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంతు షిండే హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి …

Read More »

కట్ట మరమ్మత్తు పనులు తక్షణమే పూర్తి చేయాలి

కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. రాజంపేట మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్‌ గురువారం చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువు కట్ట మరమ్మత్తు …

Read More »

డిచ్‌పల్లిలో బంద్‌ విజయవంతం

డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వామపక్ష విద్యార్థి సంఘాల విద్యాసంస్థల బంద్‌ పిలుపు మేరకు బుధవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో పాఠశాలలు కళాశాల తరగతులు బహిష్కరించి బంద్‌ చేయించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు డివిజన్‌ అధ్యక్షుడు అరుణ్‌, పివైఎల్‌ జిల్లా కార్యదర్శి సాయినాథ్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »