Constituency News

నందిపేట్‌లో వైఎస్‌ జయంతి

నందిపేట్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత జననేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ చేసిన సేవలను గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను జ్ఞాపకం చేశారు. …

Read More »

బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి భూమి పూజ

నందిపేట్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమ సమీపంలో గల ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల సౌకర్యార్థం లయన్స్‌ క్లబ్‌ నందిపేట ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి శుక్రవారం మంగి రాములు మహారాజ్‌ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ వలె ఇతర స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా …

Read More »

పరీక్షల షెడ్యూల్‌ తేదీలలో మార్పు

డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ మొదటి, రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ, ఆరవ, ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ సెమిస్టర్స్‌ వన్‌ టైం చాన్స్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు జూలై 11 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఇదివరకు షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా వివిధ కోర్సులకు …

Read More »

ఆయిల్‌ పామ్‌ సాగు…లాభాలు బహు బాగు

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో అత్యధిక లాభాలను అందించే ఆయిల్‌ పామ్‌ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌లో స్థానిక సర్పంచ్‌ చిన్నారెడ్డి పదెకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ పంట సాగును ఎంచుకోగా, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, గురువారం లాంఛనంగా ఆయిల్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం …

Read More »

జాతీయ స్థాయి ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌కి టియు విసి

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఉత్తర ప్రదేశ్‌ వారణాసిలో ఈ నెల 7, 8, 9 తేదీలలో నిర్వహింపబడనున్న జాతీయ స్థాయి ‘‘వారణాసి శిక్షా సమ్మేళన్‌ – మూడు రోజుల ఎడ్యూకేషన్‌ సమ్మిట్‌’’లో పాల్గొననున్నారు. 3వ తేదీన సెక్రటరీ యూజీసీ నుండి 27 జూన్‌, 2022 నాటి ఉత్తరం నం. ఎఫ్‌. 1-1/2022 (ఎన్‌ఇపి ` …

Read More »

రైల్వే స్టేషన్‌ను పునరుద్దరించాలి

ఎడపల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను ఆదాయం లేదనే సాకుతో తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఎడపల్లి రైల్వే స్టేషన్‌ను అధికారులు మూసివేశారని, మూసివేసిన ఎడపల్లి రైల్వే స్టేషన్‌ను ఎంపి ప్రత్యేక చొరవ తీసుకొని పునరుద్దరణ చేయాలని కోరుతూ ఎడపల్లి మండల బిజెపి ఆధ్వర్యంలో బుధవారం ఎంపి అర్వింద్‌ ధర్మపురికి వినతి పత్రం …

Read More »

గురు మార్గదర్శన మహోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం గురు మార్గదర్శన మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో ఈనెల 18న బిచ్కుంద పట్టణంలో గురు మార్గదర్శన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక తాసిల్దార్‌ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా వీరశైవ జంగమ సమాజం అధ్యక్షులు విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 18న బిచ్కుంద …

Read More »

డిగ్రీలో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 2190 నమోదు చేసుకోగా …

Read More »

పాలరాతి అభయాంజనేయ విగ్రహా ప్రతిష్టపన

నందిపేట్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రములోని కేదారేశ్వర ఆశ్రమంలో బుధవారం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి 21 అడుగుల పాలరాతి అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మాట్లాడుతు, అభయాంజనేయ స్వామి మహిమ చాలా గొప్పదని పేర్కొన్నారు. భక్తులు నందిపేట వాసి డాక్టర్‌ గంగారెడ్డి కుమారుడు, ఆర్కే రైస్‌ మిల్‌ వారి సహకారంతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »