Constituency News

ఆరోగ్య కేంద్రం తనిఖీ

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేషనల్‌ టుబర్‌ క్యూలోసిస్‌ ఎలిమినేషన్‌ ప్రోగ్రాం జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశం సందర్శించారు. క్షయ వ్యాధి పరీక్ష నిర్ధారణ రిజిస్టర్‌ పరిశీలించారు. వైద్య సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. వైద్యురాలు సాయి సింధును ఓపీ నుంచి క్షయ అనుమానిత లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి నిర్ధారణ పరీక్ష కొరకు ల్యాబ్‌కు పంపాలని …

Read More »

క్షయ రహిత జిల్లాగా మార్చాలి

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిని క్షయ రహిత జిల్లాగా మార్చాలని నేషనల్‌ టుబర్‌ క్యూలోసిస్‌ ఎలిమినేషన్‌ ప్రోగ్రాం జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశం అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం క్షయ వ్యాధి నియంత్రణపై పర్యవేక్షణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2025 నాటికి క్షయ వ్యాధిని అంతమొందించే దిశగా పర్యవేక్షకులు కృషి …

Read More »

భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడు తహసిల్దార్‌ కార్యాలయాలను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ శుక్రవారం సందర్శించారు. లింగంపేట, తాడువాయి, పిట్లం తహసీల్దార్‌ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ధరణిలో పెండిరగ్‌లో ఉన్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆయా మండలాల తహసిల్దారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Read More »

గోదావరి తీరాన జింకల సందడి

నందిపేట్‌, జూన్ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని జిజి నడుకుడ గ్రామ గోదావరి తీరాన జింకలు సందడి చేస్తున్నాయి. గతంలో కూడా ప్రతి సంవత్సరం వర్షాకాల సమయంలో గోదావరి తీరాన పెద్ద సంఖ్యలో జింకలు వస్తున్నాయి. వీటిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పక్షులు, జింకల రాక తో పర్యాటకుల సందడి పెరిగింది. గత సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో జింకలు సందడి చేసాయి. …

Read More »

ముగ్గురు విద్యార్థులు డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 7978 నమోదు చేసుకోగా …

Read More »

కండబలం, గుండెబలం, బుద్ధిబలం కంటే సంకల్పబలం గొప్పది

డిచ్‌పల్లి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పోటీ పరీక్షల శిక్షణా విభాగం ఆధ్వర్యంలో న్యాయ కళాశాలలోని సమావేశ మందిరంలో గురువారం ఉదయం గ్రూప్‌ – 1 తదితర ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థి అభ్యర్థులకు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌, రిటైర్డ్‌ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి సి. పార్థసారథి ప్రధాన …

Read More »

బృహత్‌ ప్రకృతి వనాల కోసం స్థలాలు గుర్తించాలి

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం ప్రతి మండలంలో స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 26 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేసినట్లు చెప్పారు. 45 బృహత్‌ పల్లె ప్రకృతి …

Read More »

బీజేపీ ఆధ్వర్యంలో శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన దివస్‌

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనసంఫ్‌ు వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ బలిధాన్‌ దివస్‌ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని 23 వ వార్డు పరిధిలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ కుంటా లక్ష్మరెడ్డి మాట్లాడుతూ జనసంఫ్‌ు వ్యవస్థాపకులైన శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ దేశంలో జాతీయ …

Read More »

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి సిహెచ్‌సిని బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో వసతుల వివరాలను సూపరింటెండెంట్‌ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేవిధంగా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. గర్భిణీల నమోదు సక్రమంగా చేపట్టాలన్నారు. పోషకాహారం తీసుకునే విధంగా గర్భిణీలకు వైద్యులు అవగాహన కల్పించాలని కోరారు. …

Read More »

రెండోరోజు ప్రశాంతంగా పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »