Constituency News

24 నుంచి ఎంసిఎ, లా, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని కళాశాలలో గల ఎంసిఎ, లా (న్యాయ), ఐఎంబిఎ, ఎపిఇ, పిసిహెచ్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల నాల్గవ, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని ఆయా కళాశాల ప్రధానాచార్యులు మరియు బ్యాక్‌ …

Read More »

ప్రగతి పనులను పరిశీలించిన ఆర్డీవో

బోధన్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ఆర్డీవో రాజేశ్వర్‌ రావు పరిశీలించారు. మున్సిపల్‌ చైర్మన్‌ తూము పద్మశరత్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రామలింగం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డ్రైనేజీలో చెత్తాచెదారం లేకుండా చూడాలని పట్టణ ప్రగతిలో బోధన్‌ పట్టణం సుందరీకరణగా ఉండే విధంగా చర్యలు …

Read More »

పిహెచ్‌సి తనిఖీ

కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్నూర్‌ మండల కేంద్రంలోని సిహెచ్‌సిని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. వైద్య సిబ్బంది పనితీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను చూశారు. వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, తహసిల్దార్‌ అనిల్‌ కుమార్‌, సర్పంచ్‌ సురేష్‌, వైద్యాధికారి ఆనంద్‌ యాదవ్‌, సిబ్బంది …

Read More »

24 నుంచి ఎం.ఎడ్‌. ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సారంగపూర్‌ క్యాంపస్‌ కళాశాలలో గల ఎం.ఎడ్‌. మొదటి, మూడవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌, ఇంప్రూవ్‌ మెంట్‌ థియరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని ఎం.ఎడ్‌. ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాల్సిందిగా ఆమె కోరారు. పూర్తి వివరాల …

Read More »

పౌష్టికాహారం అందేలా చూడాలి

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌ వాడి కేంద్రాలలో పౌష్టికాహార లోపం లేని చిన్నారులు ఉన్న జిల్లాగా గుర్తింపు తీసుకురావడానికి ఐసిడిఎస్‌, పోషణ అభియాన్‌ ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం పర్యవేక్షణతో కూడిన అనుబంధ కార్యక్రమంపై సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. అంగన్‌వాడి …

Read More »

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తడి, పొడి చెత్తను ప్రజలు వేరు చేసే విధంగా మెప్మా రిసోర్స్‌ పర్సన్లు అవగాహన కల్పించాలని సూచించారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని నియంత్రించాలని కోరారు. ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని …

Read More »

ఆర్‌ కె కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గల ఆర్‌కె గ్రూప్స్‌ ఆఫ్‌ కాలేజెస్‌కు గురువారం ఉదయం షోకాజ్‌ నోటీసులు ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ జారీ చేశారు. కామారెడ్డిలో గల ఆర్‌కె కళాశాల గ్రూప్‌లో మూడు కళాశాలకు నోటీసులు అందాయన్నారు. ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య బి. విద్యావర్ధిని, సిబ్బంది తనిఖీ చేసి సమర్పించిన నివేదిక …

Read More »

పోటీ పరీక్షల కోచింగ్‌ క్లాసులు ప్రారంభం

డిచ్‌పల్లి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలోని సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం పోటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో తరగతులు నిర్వహింపబడ్డాయి. డైరెక్టర్‌ డా. జి. బాలశ్రీనివాస మూర్తి, డా. సిహెచ్‌. ఆంజనేయులు విషయ నిపుణులుగా విచ్చేసి తెలంగాణ చరిత్ర, జనరల్‌ నాలేడ్జ్‌, కరెంట్‌ ఎఫైర్స్‌ను అభ్యర్థులకు బోధించారు. విద్యార్థులు అడిగిన సమస్యలకు పరిష్కార మార్గాలను …

Read More »

పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్‌లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణం పనులను గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Read More »

రూ. 11 కోట్లతో మోర్తాడ్‌ సర్వతోముఖాభివృద్ది

మోర్తాడ్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌ మండల కేంద్రంలో సుమారు 4.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు, డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూడు విడతల్లో మండల కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకునే విదంగా ప్రణాళిక రూపొందించినట్లు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »