బాన్సువాడ, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ (చింతల్ నాగారం) శివారులో నూతనంగా 14 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను బుధవారం స్థానిక నాయకులు ప్రజా ప్రతినిదులతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చెక్ డ్యాం నిర్మాణ అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసీఆర్కి, తెలంగాణ రాష్ట్ర …
Read More »తెరాస పాలనలో మహిళలకు రక్షణ కరవు
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకి వస్తున్న అనూహ్య స్పందన చూసి ఓర్వలేక దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, రామాయంపేట తల్లి కొడుకుల ఆత్మ హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ …
Read More »అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిమాపక శాఖ అధికారులు వరదలు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు సేవ చేయడానికి ముందుంటారని …
Read More »ఘనంగా మహనీయుల జయంత్యుత్సవాలు
డిచ్పల్లి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్లో మంగళవారం ఉదయం మహనీయుల జయంత్యుత్సవాలను నిర్వహించారు. బాబు జగ్జీవన్ రాం, మహాత్మా జ్యోతి బాఫులే, డా. బాబా సాహెబ్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకను కలిపి ఒకే వేదికపై నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర …
Read More »కామారెడ్డిలో మెగా హెల్త్ క్యాంపు
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంప్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్, ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని ఆరోగ్య కేంద్రాల ప్రజలు ఈ …
Read More »ఆపరేషన్ నిమిత్తం ఏబి నెగిటివ్ రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ విష్ణు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై పూజిత (21)కు ఏబి నెగెటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం నిజామాబాద్ రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే గిద్ద గ్రామానికి చెందిన రక్తదాత సంతోష్ సహకారంతో …
Read More »కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి…
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ, సహకార, పౌర సరఫరా, రవాణా, ఐకెపి, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతు ధాన్యంను ప్యాడి …
Read More »వేసవిలో పశుపోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలు
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవిలో పశుపోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సంరక్షించుకోవడానికి పాటించవలసిన సూచనల వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఆవిష్కరించారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ సందర్భంగా మాట్లాడారు. గేదెలు, గొర్రెలు, మేకల, కోళ్ల పెంపకం పోషణలో వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మేతకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు …
Read More »ఈ నెల 25 వరకు బి.ఎడ్. పరీక్ష ఫీజు గడువు
డిచ్పల్లి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 25 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 26 వ తేదీ వరకు, …
Read More »టీయూలో మహనీయుల జయంత్యుత్సవాలు
డిచ్పల్లి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ మరియు బీసీ సెల్ ఆధ్వర్యంలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్లో మంగళవారం ఉదయం మహనీయుల జయంత్యుత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి …
Read More »