డిచ్పల్లి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ వెనుక భాగంలోని మామిడి తోటలో గల హనుమాన్ మందిరంలో మంగళవారం ఉదయం శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారని హనుమాన్ జన్మదినోత్సవ వేడుకల కమిటీ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహింపబడుతుందన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ హనుమాన్ జన్మదినోత్సవ వేడుకల కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి విశిష్ట …
Read More »ఎన్ఎస్ఎస్ సేవాతత్పరత అమోఘం
డిచ్పల్లి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్ఎస్ఎస్ కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి …
Read More »మానవత్వానికి మించిన మతం లేదు
కామారెడ్డి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా నర్సింగ్కు చెందిన రేణుక (21) గర్భిణీకి అత్యవసరంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల మెదక్ ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బద్దం నిశాంత్ రెడ్డికి తెలియజేయగా వెంటనే రాత్రి వేళ అయినా …
Read More »సేవా గుణమే పరమావధి
డిచ్పల్లి, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో శనివారం కూడా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ కొనసాగింది. ఆరవ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్. ఆరతి విచ్చేసి ప్రసంగించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు …
Read More »అంటరానితనం ఇక సాగబోదు
ఆర్మూర్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ‘‘అంటరానితనం అనే దురాచారం అభివృద్ధికి అడ్డుగోడ. తోటి మనిషిని మనిషిగా చూడలేని ఈ అనాగరిక ఆచారం పల్లెల ప్రగతికి అవరోధం. ఇలాంటి అవలక్షణాల నుంచి బయటపడితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని చాటి చెప్పడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనదైన శైలిలో ఓ ప్రయత్నాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ అంబేడ్కర్ 131వ జయంతి వేడుకల సందర్భంగా జీవన్ …
Read More »ప్రపంచ మేధావి, భారతరత్న అంబేద్కర్ జయంతి
ఆర్మూర్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ …
Read More »నాడు అద్దె వాహనాలు… నేడు వాహన యజమానులు
కామారెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొన్నటి వరకు అద్దె వాహనాలు నడిపిన వ్యక్తులు దళిత బంధు పథకంతో వాహనాలు పొంది యజమానులుగా మారారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం దళిత బందు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. దళితుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో దళిత బంధు …
Read More »దీన జనోద్ధారకుడు అంబేడ్కర్
డిచ్పల్లి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డా. ఎం. బి. భ్రమరాంబిక ఆధ్వర్యంలో డా. భీం రావ్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవం గురువారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల అలంకరణ చేసి వందనం చేశారు. కార్యక్రమంలో …
Read More »మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని ప్రజలు నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గురువారం డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ జయంతి వేడుకలు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. పట్టుదలతో …
Read More »66 సారి రక్త దానం చేసిన బాలు
కామారెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త,కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 66 సారి రక్త దానం చేశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రక్తం లేని కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పో కూడదనీ, …
Read More »