Constituency News

పయనీర్‌ సీడ్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

ఆర్మూర్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం సుబ్బిరియల్‌ గ్రామంలో పయనీర్‌ సీడ్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తున్నారని మగవారితో పోలిస్తే ఆడవారు ఏ రంగంలోనూ వెనుక లేరని, ఆడవారు ప్రతి ఇంటిలో ఒక తల్లిగా చెల్లెలిగా వారు సేవ చేస్తున్నారని, …

Read More »

గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన టిఎస్‌పిఎస్‌ సభ్యురాలు

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్‌ ఆవరణలో మంగళవారం టిఎస్‌పిఎస్‌ సభ్యురాలు సుమిత్రానందన్‌ మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిని సరస్వతి, జిల్లా బాల రక్షణ అధికారిని స్రవంతి, సిడబ్ల్యూసి సభ్యురాలు స్వర్ణలత, …

Read More »

పెండిరగ్‌ ఉపకారవేతనాల దరఖాస్తులు రెండు రోజుల్లో పూర్తి చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బిసి శాఖల వారీగా పెండిరగ్‌ దరఖాస్తులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన జిల్లా సంక్షేమ అధికారులతో, కళాశాలల ప్రిన్సిపాళ్లతో పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హత ఉన్న …

Read More »

యువతకు విలువలతో కూడిన చదువులు అవసరం

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి యువతకు విలువలతో కూడిన చదువులు అవసరమని కామారెడ్డి జిల్లా కోర్టు జడ్జి రమేష్‌ బాబు పేర్కొన్నారు. మంగళవారం కోర్టు సముదాయంలోని బార్‌ అసోసియేషన్‌ హాలులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జడ్జి రమేష్‌ బాబు మాట్లాడుతూ మహిళా శక్తి …

Read More »

సమాజంలో మహిళలు, పురుషులు సమానంగా భావించాలి

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో మహిళలు, పురుషులు సమానమేనని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కామారెడ్డి పట్టణంలోని తాహెర్‌ గార్డెన్‌లో మంగళవారం ఐసిడిఎస్‌, ఫీల్డ్‌ ఔట్రీచ్‌ బ్యూరో, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

కోమటి చెరువు అందాలకు కామారెడ్డి కలెక్టర్‌ ఫిదా

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోమటి చెరువు అందాలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఫిదా అయ్యారు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసిజిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోమటి చెరువును సందర్శించారు. తీగెల వంతెనపై కాలినడకన కోమటి చెరువు అందాలను వీక్షించారు. చెరువులో బోటు షికారు చేస్తూ లేజర్‌ లైట్‌, మ్యూజికల్‌ ఫౌంటెన్‌ షోను తిలకించి మంత్ర ముగ్ధులయ్యారు. …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన రెండవ …

Read More »

ధరణి టౌన్‌షిప్‌లో చదరపు గజం ధర రూ. 7000

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్లో చదరపు గజం ధర రూ 7000 ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్‌ హాల్లో సోమవారం టౌన్షిప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గతంలో ప్రభుత్వం చదరపు గజం ధర రూపాయలు 10000 నిర్ణయించిందని చెప్పారు. సామాన్య ప్రజలు …

Read More »

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఏవో రవీందర్‌, వివిధ శాఖల …

Read More »

టియులో స్పోర్ట్స్‌ బోర్డ్‌ ఏర్పాటు

డిచ్‌పల్లి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం స్పోర్ట్స్‌ బోర్డు ఏర్పాటు చేయబడిరదని స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి. రాంబాబు తెలిపారు. బోర్డు కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించామని తెలిపారు. బోర్డుకు చైర్మన్‌గా తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, కన్వీనర్‌గా డాక్టర్‌ జి రాంబాబు వ్యవహరిస్తారని అన్నారు. కమిటీలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »