కామారెడ్డి, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ పరంజ్యోతి అమ్మభగవాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం 9 గంటలనుండి గోమాత పూజ, మరియు కుంకుమ పూజలు, పాదుకాభిషేకం, పుష్పాభిషేకం అమ్మ భగవానుల దర్శనం మరియు మధ్యాహ్నం 1 గంట నుండి అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పవళింపు సేవ, ఆలయంలో నిర్వహించడం జరుగుతుందని ఆలయ సేవకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీ కల్కి …
Read More »లయన్స్ క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకం
ఆర్మూర్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజ హితమే పరమావధిగా లయన్స్ క్లబ్ దేశ, విదేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా స్ఫూర్తి పేరిట ఆర్మూర్ పట్టణంలోని విజయలక్ష్మి గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి …
Read More »నా ఓటే నా భవిష్యత్ – ఒక్క ఓటుకున్న శక్తి
కామారెడ్డి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ‘నా ఓటే నా భవిష్యత్ – ఒక్క ఓటు కున్న శక్తి’ అనే అంశంపై భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవం – 2022 సందర్భంగా ఓటర్ ఆవగాహన పోటీ నిర్వహిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమం …
Read More »యువత సన్మార్గంలో నడవాలి
కామారెడ్డి, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత సన్మార్గంలో నడవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దేవునిపల్లి లోని లక్ష్మీదేవి గార్డెన్లో ఆదివారం 283 వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు కామారెడ్డి నియోజకవర్గం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అటవీ సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి …
Read More »ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రారంభోత్సంలో పాల్గొన్న టీయూ న్యాయ విభాగాధిపతి
డిచ్పల్లి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కోర్టులో పోక్సో కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రారంభోత్సవం శనివారం ఉదయం నిజామాబాద్లోని ప్రధాన కోర్టు ఆవరణలో జరిగింది. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జిల్లా న్యాయమూర్తి జస్టిస్ సునీతా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు హాజరైనారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగానికి చెందిన …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 22 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 14 లక్షల 40 వేల రూపాయల చెక్కులను, కామారెడ్డి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భిక్కనూర్ మండలంలోని లక్ష్మీదేవుని పల్లి గ్రామానికి చెందిన నాగర్తి నర్సా రెడ్డి, పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాములు, జంగంపల్లి గ్రామానికి చెందిన ధర్మారెడ్డి గారి రాజి రెడ్డిలు ప్రమాదవశాత్తు మృతి …
Read More »12న జాతీయ లోక్ అదాలత్ ….
కామారెడ్డి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టుల వరకు పెండిరగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్థన్రెడ్డి తెలిపారు. క్రిమినల్, సివిల్, లిటిగేషన్ కేసులన్నింటినీ ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కేసుల పరిష్కారాన్ని కోరుకునే కక్షిదారులు ఈ అవకాశాన్ని …
Read More »సురక్షిత ప్రయాణం కొరకు స్పీడ్ లిమిట్ ఏర్పాటు…
కామారెడ్డి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డుప్రమాదాలను, మరణాల మరియు క్షతగాత్రుల సంఖ్యను తగ్గించే చర్యలలో భాగంగా మరియు ఉన్నత న్యాయస్తానముల, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నేటి నుండి జాతీయ రహదారి ఎన్హెచ్-44 (బిక్కనూర్ నుంచి దగ్గి అటవీ ప్రాంతం-కామారెడ్డి జిల్లా పరిదిలో) స్పీడ్ లిమిట్ ‘‘80’’ చేసినట్టు కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వాహనదారులు ఎవరైనా తమ వాహనాలను …
Read More »న్యాయ వ్యవస్థకు న్యాయవాదులే పునాదులు
కామారెడ్డి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయ వ్యవస్థకు న్యాయవాదులే పునాదులని సత్వర న్యాయానికి తమ వంతు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బిక్షపతి అధ్యక్షత వహించారు. కామారెడ్డిలో నూతనంగా అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తామని …
Read More »ద్రువీకరణ పత్రాలు సమగ్రంగా పరిశీలించాలి…
నిజాంసాగర్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళితబందు లబ్ధిదారుల ధ్రువీకరణ పత్రాలను సమగ్రంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నిజాంసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. నిజాంసాగర్ మండలాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని తెలిపారు. అధికారులు గ్రామస్థాయిలో గ్రామ సభ ఏర్పాటు చేసి లబ్ధిదారులు ఎంచుకోవాల్సిన యూనిట్ల పై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే …
Read More »