Constituency News

స్టేడియంను పరిశీలించిన కలెక్టర్‌

కామరెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంను సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. గదిలో ఉన్న క్రీడా పరికరాలను పరిశీలించారు. వీటిని క్రీడాకారులు వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట జిల్లా క్రీడలు, యువజన సర్వీసులు అధికారి దామోదర్‌ రెడ్డి, తహసీల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, అధికారులు ఉన్నారు.

Read More »

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుంది

కామరెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌ పాఠశాలలో సోమవారం ఆజాదీకా అమృత మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా యజ్ఞ సహిత యోగా సూర్య నమస్కారాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆసనాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచించారు. యోగా …

Read More »

జన్నెపల్లె పెద్ద వాగులో యువకుడి మృతి

నవీపేట్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలోని జన్నెపల్లె గ్రామ పెద్దవాగులో యువకుడి మృతి కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి… జన్నెపల్లె గ్రామానికి చెందిన అరే శ్రీధర్‌ (24) అనే యువకుడు కనిపించక పోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. అనంతరం జన్నెపల్లె పెద్ద వాగు సమీపంలో బట్టలు, సెల్‌ ఫోన్‌, చెప్పులు కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. గజఈతగాళ్ళ …

Read More »

దళితబంధు అర్హుల ఎంపిక భాద్యతలు అదికారులకే అప్పగించాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు అర్హుల ఎంపిక బాధ్యతలు ఎమ్మెల్యేలకు కాకుండా అధికారులకే అప్పగించాలని, అర్హుల ఎంపిక లో నిరుపేదలకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని, దళిత బందును పేదల బందుగా మార్చి అన్ని కులాలలో ఉన్న పేదలందరికీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్‌ డిప్యూటీ తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పివైఎల్‌ జిల్లా …

Read More »

జిల్లా కలెక్టర్‌ రక్తదానం చేశారు…

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తాడ్వాయి మండలం సంగోజివాడిలో శనివారం వసంతపంచమి సందర్భంగా శ్రీ సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులు …

Read More »

మాస్‌ కమ్యూనికేషన్‌ లో ఇద్దరికి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలోని పరిశోధక విద్యార్థులు సట్లపల్లి సత్యం, సిహెచ్‌. రమేష్‌ లకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. వారు రూపొందించిన సిద్ధాంత గ్రంథాల మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో గల మినీ సెమినార్‌ హాల్‌లో శనివారం ఉదయం ఓపెన్‌ వైవా వోస్‌ (మౌఖిక పరీక్ష) నిర్వహించారు. మాస్‌ …

Read More »

పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి..

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదో తరగతిలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుల సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. చదువులో …

Read More »

భారతరత్న జూనియర్‌ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి…

బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా బాన్సువాడ పట్టణంలో ఉన్న భారతరత్న జూనియర్‌ కళాశాల యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని (ఏ.ఐ.ఎస్‌.బీ) ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బైరాపూర్‌ రవీందర్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో కోవిడ్‌ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని మాస్క్‌లు, భౌతిక దూరం, శనిటైజర్‌ ఏమాత్రం పాటించడం లేదని, …

Read More »

టీయూను పరిశోధనా ప్రాంగణంగా తీర్చిదిద్దుతా…

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో గల సమావేశ మందిరంలో శుక్రవారం రెగ్యూలర్‌, కాంట్రాక్ట్‌ అధ్యాపకులందరితో వీసీ ఆచార్య రవీందర్‌ గుప్తా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ నెల 1 వ తేదీ నుంచి ప్రత్యక్ష (భౌతికంగా) క్లాసులు ప్రారంభమైనందు వల్ల అధ్యాపకులందరితో పాఠ్యప్రణాళికలు, టైం టేబుల్‌, వర్క్‌ లోడ్‌ వంటి …

Read More »

ఆర్‌టిఐని అందరు వినియోగించుకోవాలి…

నసురుల్లాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌టిఐ అవగాహన రక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా 2022 సంవత్సరం క్యాలెండర్‌ని నసురుల్లాబాదు తహసీల్దార్‌ బాబాయ్య, నసురుల్లాబాదు ఎస్‌ఐ నారాయణ సింగ్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లా ఉపాధ్యక్షులు మొగులయ్య మాట్లాడుతూ ఆర్‌టిఐని అందరూ వినియోగించుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా ఆర్‌టిఐ ద్వారా పోదవచ్చని పేర్కొన్నారు. ఆర్‌టిఐకి ప్రభుత్వ ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బాన్సువాడ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »