Constituency News

24 వరకు డిగ్రీ మొదటి, రెండవ సెమిస్టర్స్‌ రీవాల్యూయేషన్‌

డిచ్‌పల్లి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల సిబిసిఎస్‌ పాఠ్య ప్రణాళికకు అనుగుణమైన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, రెండవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు ఈ నెల 24 వ తేదీ వరకు రీవాల్యూయేషన్‌, రీకౌంటింగ్‌ …

Read More »

ఆర్మూర్‌ బస్టాండ్‌లో చోరీ

ఆర్మూర్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ బస్టాండ్‌లో బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు చోరీ జరిగింది. నందిపేట్‌ అన్నారం బస్సులో నందిపేట్‌ వెళ్లడానికి ఓ మహిళ పాపని పట్టుకొని బస్సు ఎక్కే సమయంలో తన కవర్‌ కట్‌ చేసి పర్సు దొంగిలించారు. పర్సులో అర తులం బంగారు ఉంగరం, కొంత నగదు ఉందని బాధితురాలు తెలిపింది. కొద్ది సేపటి తర్వాత చూస్తే డబ్బులు, బంగారం …

Read More »

వృద్ధులకు స్వెటర్ల పంపిణీ

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా డిఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం క్యాసంపల్లీ వృద్ధాశ్రమంలో శారదా దేవి ఫౌండర్‌ ఆధ్వర్యంలో 30మంది వృద్ధులకు స్వెటర్లు, బ్లాంకెట్‌లు, 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో డిఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, జాతీయ బీసీ …

Read More »

తపస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఆర్మూర్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) ఆధ్వర్యంలో బుధవారం వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక మండల వనరుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 2022 సంవత్సరం క్యాలెండర్‌ను ఆర్మూర్‌ డివిజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బాబు రామ్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ బాధ్యులు తిరునగరి దయాసాగర్‌, రుద్ర మధుసూదన్‌, రాంప్రభు, టీవీ రవికాంత్‌, …

Read More »

బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలోని బార్‌ అసోసియేషన్‌ హాలులో బుధవారం వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కామారెడ్డి సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు జోగు గంగాధర్‌, ప్రతినిధులు దేవేందర్‌ గౌడ్‌, దేవుని సూర్య ప్రసాద్‌, నిమ్మ …

Read More »

25 లోగా ఓటరు కిట్‌ అందజేయాలి…

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి, ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్‌ గుర్తింపు కార్డు ఎపిక్‌ కార్డులు బూత్‌ లెవల్‌ అధికారుల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ జిల్లా కలెక్టర్‌లను కోరారు. బుధవారం ఆయన జిల్లా …

Read More »

రక్తహీనత ఉన్న పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించాలి..

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని అంగన్‌ వాడి కేంద్రాలలో రక్తహీనత లోపం ఉన్న పిల్లలను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం వైద్యులు, ఐసిడిఎస్‌ అధికారులు, ఐకెపి అధికారులతో రక్తహీనత లోపం ఉన్న పిల్లలపై వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామాల్లోని అంగన్‌వాడి కేంద్రాల్లో ఉన్న పిల్లలను ఆర్‌బిఎస్‌కేటీంలు పరిశీలించి వారికి …

Read More »

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద

కమ్మర్‌పల్లి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా కమ్మరపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని …

Read More »

ప్రణాళిక బద్దంగా పారిశుద్య పనులు చేపట్టాలి

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్య పనులను చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని స్మశాన వాటిక లను, డంపింగ్‌ యార్డ్‌ లను వినియోగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాలు …

Read More »

యువజన సమాజ్‌ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి

ఆర్మూర్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ యువజన సమాజ్‌ అధ్యక్షులు వడ్డీ ప్రశాంత్‌, కార్యదర్శి విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే ప్రశాంత్‌ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ సమాజ్‌ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహించామని, భారత దేశ యువత స్వామి వివేకానంద …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »