Constituency News

కెసిఆర్‌ పాలనకు చరమగీతం…

ఆర్మూర్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఆర్మూర్‌ పట్టణ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, బిజెపి ఆర్మూర్‌ ఇంచార్జ్‌ న్యాలం రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ కెసిఆర్‌ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడడం మొదలైందని …

Read More »

అనాథ చిన్నారులకు బట్టల పంపిణీ

ఆర్మూర్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లిలో తపస్వి తేజో నిలయంలో దీపావళి పండుగ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ జోన్‌ చైర్మన్‌ డి కే రాజేష్‌ – పద్మ కుటుంబ సభ్యులతో కలిస ిఅనాధ చిన్నారులకు ఉచితంగా బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ జోన్‌ చైర్మన్‌ డీకే రాజేష్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. …

Read More »

నిర్మాణ రంగ కార్మికులకు మెరుగైన సంక్షేమాలను అందించాలి

బోధన్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు పాలకులు మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలంగాణ ప్రగతి శీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (ఐఎఫ్‌టీయూ) జిల్లా కార్యదర్శి బి.మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం బోధన్‌ పట్టణం రాకాసిపేట్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో బి.మల్లేష్‌ మాట్లాడుతూ నేడు నిర్మాణ రంగంలో పనిచేసే …

Read More »

కలెక్టర్‌ను కలిసిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా రెవిన్యూ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రేమ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రేను కలిశారు. …

Read More »

రోజువారి లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్‌ చేపట్టాలి

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి వరి ధాన్యాన్ని మిల్లర్లు రోజువారి లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్‌ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నవంబర్‌ 30 లోగా మిల్లింగ్‌ పూర్తిచేయాలని సూచించారు. యాసంగిలో కొనుగోలు చేపట్టిన ధాన్యంలో 30 శాతం …

Read More »

పెండిరగ్‌ ఫైళ్ళు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణిలో పెండిరగ్‌లో ఉన్న ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలోని తన చాంబర్‌ నుంచి తహసిల్దార్‌లతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. రాజంపేటలో 15, మాచారెడ్డిలో 13 పెండిరగ్‌లో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీటిని తక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఎల్‌.ఎం.లో పెండిరగ్‌ మ్యుటేషన్లు లేకుండా చూడాలని అధికారులను …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మంగళవారం నందిపేట్‌, మల్లారం, ఐలాపూర్‌లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారుగా 70 నుంచి 80 శాతం కోతలు పూర్తయ్యాయన్నారు. ఎఫ్‌ ఏ క్యూ ధాన్యం కొనుగోలు 17 శాతం తేమ పర్సంటేజ్‌ ఉన్న ధాన్యంతో కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నారని పిఎసిఎస్‌, ఐకెపి …

Read More »

108 అధికారులకు ప్రశంసా పత్రాలు

కామరెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ సామ్రాట్‌కు, కామారెడ్డి జిల్లా ఇయంఇలు, సాయికిరణ్‌, అనిరుద్‌లకు ఏయఫ్‌ఇలు రాజయ్య, విజయ్‌లు 108, 102, 1962, ప్రాజెక్టుల యందు ప్రజలకు అందించిన (అత్యవసర సేవలకు), గర్భిణీలకు, మూగజీవాలకు, కామారెడ్డి జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించడంలో సఫలీకృతమైనందుకు జివికె ఇఎంఆర్‌ఐ సంస్థ, హైదరాబాద్‌లో ఉత్తమ ప్రతిభా పురస్కారములకు ఎంపిక చేసి అవార్డులను అందజేశారు.

Read More »

పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల సమావేశం

నందిపేట్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో మంగళవారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశామని ప్రధానోపాధ్యాయులు జాన్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామస్థులకు తెలిపామన్నారు. ప్రస్తుతం పాఠశాలలో 208 మంది పిల్లలు ఉన్నారని వారికి విద్య బోధించడానికి ఉపాధ్యాయుల కొరత ఉందని తరగతి గదులు కొరత ఉందని పిల్లలు తల్లిదండ్రులకు వీడీసీ …

Read More »

నవంబర్‌ 8 నుండి గ్రామసభలు

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూముల సంరక్షణ, పోడు వ్యవసాయం పై నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను మండల ప్రత్యేక అధికారులు పరిశీలించాలని సూచించారు. కొవిడ్‌ కేసులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »