Constituency News

జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి. పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం 765డి మెదక్‌ నుంచి రుద్రూర్‌ వరకు చేపడుతున్న జాతీయ రహదారి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీ, రెవిన్యూ, మిషన్‌ భగీరథ, ట్రాన్స్‌కో అధికారులు సమన్వయంతో సర్వే చేపట్టి …

Read More »

ప్లేట్‌ లేట్స్‌ దానం చేయడం అభినందనీయం

కామారెడ్డి, సెప్టెంబ‌ర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన తేజస్కర్‌ (21) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాల సంఖ్య పడిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పాల్వంచ గ్రామానికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ నవీన్‌కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో స్పందించి హైదరాబాద్‌ వెళ్లి బి నెగిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అందించి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు …

Read More »

న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నమూనా న్యాయస్థానం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయశాస్త్ర విభాగం ఆద్వర్యంలో సోమవారం మూట్‌ కోర్ట్‌ ట్రయల్స్‌ (నమూనా న్యాయస్థానం) కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు విభాగ అద్యక్షులు డాక్టర్‌ బి.స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌ఎల్‌బి ఆరవ సెమిస్టర్‌ విద్యార్థుల కోసం ఉద్దేశించిన నమూనా న్యాయస్థానం కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుందని ఆమె వివరించారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని డాక్టర్‌ స్రవంతి తెలిపారు. …

Read More »

ఇద్దరు దొంగల అరెస్టు

జక్రాన్‌పల్లి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అంకాపూర్‌, మునిపల్లి, లక్కోర, జక్రాన్‌పల్లి గ్రామాలలో జూన్‌, జూలై, ఆగస్టు నెలలో పగటి పూట ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్ర రాష్ట్రం ఉమ్రికి చెందిన ఇద్దరు నేరస్థులను పట్టుకొని వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు రికవరీ చేసి రిమాండ్‌కి పంపిననట్టు జక్రాన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో సాయిరెడ్డి తెలిపారు. …

Read More »

వాస్తవాలు మాట్లాడితే….మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లా?

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిర్మల్‌ సభలో మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారంటూ టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 22వ రోజు పాదయాత్ర నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన …

Read More »

కామారెడ్డి లయన్స్‌ క్లబ్‌ సేవల్లో కలికితురాయి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో కామారెడ్డి లైన్స్‌ క్లబ్‌కు ప్రత్యేక స్థానం ఉందని, కామారెడ్డి లైన్స్‌ క్లబ్‌ తెలంగాణకు కలికితురాయి అని జిల్లా కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజల బిక్షపతి పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టుల బార్‌ అసోసియేషన్‌లో లైన్స్‌ క్లబ్‌ కామారెడ్డి సంయుక్తంగా డయాబెటిక్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా న్యాయవాదులు, జుడిషియల్‌ సిబ్బందికి షుగర్‌ టెస్ట్‌లు నిర్వహించారు. 90 …

Read More »

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జిల్లా అంతటా వినాయక నిమజ్జనానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం సిపి కార్తికేయ, అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రాతో కలిసి బాసర గోదావరి బ్రిడ్జిపై గణేష్‌ నిమజ్జనానికి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 19వ …

Read More »

వరద కాలువకు నీటి విడుదల

ముప్కాల్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర మంత్రివర్యులు, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11 గంటలకు వరద కాలువ ద్వారా నీటి విడుదల చేశారు. ముప్కాల్‌ ఎంపిపి సామ పద్మా వెంకట్‌ రెడ్డి ఈ సందర్బంగా ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు నుంచి వరద కాలువకు 2 వేల క్యూసెక్కుల నీటిని బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ప్రాజెక్టు …

Read More »

నిమజ్జన పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో ఆదివారం రాత్రి జరిగే గణేశ నిమజ్జన కార్యక్రమం కోసం టేక్రియల్‌ చెరువు వద్ద జరుగుతున్న పనులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పరిశీలించారు. ఆయన వెంట మునిసిపల్‌, పోలీస్‌, రెవిన్యూ, నీటి పారుధల శాఖ అధికారులతో పాటు డిఎస్‌పి, ఛైర్మెన్‌, వైస్‌ చైర్మన్‌ తదితరులు ఉన్నారు.

Read More »

గణేష్‌ నిమజ్జనానికి సర్వం సిద్ధం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వినీత పవన్‌ అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని పెర్కిట్‌, మామిడిపల్లి, గుండ్ల చెరువులను అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే గణేష్‌ నిమజ్జనానికి తరలివెళ్లే శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించి రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చివేయించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా నిమజ్జనం జరిగే చెరువులు, బావుల వద్ద బారికేడ్లు ఏర్పాటు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »