ఆర్మూర్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో గ్రామ దేవతలకు సర్వ సమాజ్ ఆధ్వర్యంలో జలాభిషేకం నిర్వహించినట్టు అధ్యక్షులు మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గ్రామదేవతలకు సర్వ సమాజ్ ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాల మధ్య జలాభిషేకం నిర్వహించారు. పట్టణ ప్రజలు సుఖ సంతోషాల మధ్య ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆరు పంతాల కమిటీ …
Read More »నిరుపేద వివాహానికి రోటరీ క్లబ్ ఆర్థిక సాయం
ఆర్మూర్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు గోనె శ్రీధర్ ఆర్థిక సహకారంతో మునిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో తండ్రి లేని కూతురి వివాహానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షులు విద్య ప్రవీణ్ పవర్ మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కైన తండ్రిని …
Read More »జూలై 3 వరకు డిగ్రీ ఫీజు గడువు పొడగింపు
డిచ్పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ మరియు రెండవ బ్యాక్ లాగ్ పరీక్షలకు ఈ నెల 21 వ తేదీ వరకు ఉన్న ఫీజు గడువును విద్యార్థుల సౌకర్యార్థం ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే …
Read More »సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి…
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు జిల్లా ఆస్పత్రి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి బాలరాజు, దశరథ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా దోమకొండ, బాన్సువాడ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు 7 వేల రూపాయలు, 7 వేల 500 చాలీచాలని …
Read More »పార్కింగ్ స్థలాలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదివారం కామారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ ను ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో పార్కింగ్ స్థలాలను జిల్లా కలెక్టర్ ఎ.శరత్ శనివారం పరిశీలించారు. అడ్లూర్ రోడ్లో వాహనాలు పార్కింగ్ చేయడానికి పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణ ప్రకృతి వనం పరిశీలించారు. రైల్వే గేట్ సమీపంలో ఉన్న నర్సరీని పరిశీలించారు. నర్సరీలో ఉన్న వివిధ రకాల …
Read More »చైల్డ్ డెవలప్మెంట్ పీవోకు కల్యాణ లక్ష్మీ బాధ్యత
హైదరాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదింటి ఆడ పిల్లల పెళ్లికి ప్రభుత్వం అందించే కల్యాణ లక్ష్మి పథకంలో దరఖాస్తుల పరిశీలన అధికారాన్ని మహిళా-శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్న ఛైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్కు అప్పగించారు. కల్యాణ లక్ష్మి పథకం దరఖాస్తుల పరిశీలన అధికారం ఇప్పటి వరకు తహసీల్దార్లకు ఉంది. 20 మార్చి 2012న జారీ చేసిన జీవో 14లో ఉన్న నిబంధనను మార్చి …
Read More »స్వాగత ఏర్పాట్ల పరిశీలన
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నూతన జిల్లా కలెక్టరేట్ సముదాయ భవనం, నూతన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సందర్భంగా స్వాగత ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, నిజామాబాద్ జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ పరిశీలించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్. శ్వేత, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ …
Read More »కొత్త జిల్లాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో చోటు
హైదరాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్తగా ఏర్పడ్డ జిల్లాల నుండి హెచ్.సీ.ఏ.లో ఆరుగురు సభ్యులను హెచ్సిఏ అధ్యక్షుడు అజారుద్దీన్ శనివారం నియమించారు. రాష్ట్రంలో క్రికెట్ క్రీడను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్సిఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచి, అన్ని జిల్లాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సాహించనుంది. ఇందులో భాగంగా పలు …
Read More »కరోనాతో అనాథలైన విద్యార్థులకు ఉచిత విద్య
హైదరాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, ఇంటర్మీడియట్లో 70 శాతానికిపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా అందించనున్నట్లు మల్లారెడ్డి విశ్వవిద్యాలయ కులపతి డీఎన్ రెడ్డి తెలిపారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, పారామెడికల్ సైన్సెస్, మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్పాలసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందన్నారు. ఈ ఏడాది కొత్తగా …
Read More »నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు
మోర్తాడ్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తి వేసిందని, ప్రజలు అశ్రద్ధ వహించరాదని, కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం తప్పదని, రాష్ట్రంలో కరోన మహమ్మారి పూర్తిగా సమసిపోలేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ప్రతినిత్యం మాస్కులు ధరించడం తప్పనిసరిగా శానిటైజర్ వాడాలని ప్రజలు గుమికూడి ఉండరాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వివిధ …
Read More »