nizamabad

భారత స్వాతంత్య్ర శోభ ప్రతిబింబించేలా వజ్రోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత స్వాతంత్య్ర శోభ ప్రతిబింబించేలా వజ్రోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. అన్ని గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలలో నిర్దేశిత కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఉత్సవాల …

Read More »

ప్రజావాణికి 67 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటు ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 67 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో …

Read More »

కామన్‌ వెల్త్‌ క్రీడల్లో నిజామాబాద్‌ బిడ్డ హుస్సాముద్దీన్‌కు కాంస్య పతకం

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామన్‌ వెల్త్‌ క్రీడల్లో నిజామాబాద్‌కు చెందిన మరో బిడ్డ సుబేదార్‌ హుస్సాముద్దీన్‌ పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి క్రీడాకారుల పుట్టినిల్లు నిజామాబాద్‌ గడ్డ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. నిజామాబాద్‌ జిల్లా, తెలంగాణ కీర్తిని …

Read More »

నిజామాబాద్‌ బిడ్డ గెలుపు యావత్‌ దేశానికి గర్వ కారణం

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో ఉమెన్స్‌ బాక్సింగ్‌ 50 కేజీల విభాగంలో నిజామాబాద్‌ బిడ్డ నిఖత్‌ జరీన్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్‌, నేడు ఎంతో ప్రతిష్టాత్మకమైన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో ఐర్లాండ్‌కు చెందిన పగిలిస్ట్‌ను …

Read More »

ఐఎఫ్‌టియు కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా జనరల్‌ కౌన్సిల్‌ విజయవంతమైంది. ఈ సందర్భంగా కౌన్సిల్లో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ఎం. ముత్తెన్న, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.సుధాకర్‌, జిల్లా ఉపాధ్యక్షులుగా ఎం.వెంకన్న, డి. రాజేశ్వర్‌ సహాయ కార్యదర్శులుగా బి.మల్లేష్‌, ఆర్‌.రమేష్‌, కోశాధికారిగా కే.రవితో పాటు 16 మంది జిల్లా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ …

Read More »

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో పొరపాట్లకు తావుండకూడదు

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్న నేపథ్యంలో, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో శనివారం ఆయా శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్‌ వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేస్తూ, కీలక సూచనలు …

Read More »

గృహహింస చట్టాలపై అవగహన కలిగి ఉండాలి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆజాదీక అమృత్‌ ఉత్సవంలో భాగంగా నిజామాబాద్‌ నవీపేట్‌ మండలం కమలాపూర్‌ గ్రామంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్‌ ఎక్సైజ్‌ మెజిస్ట్రేట్‌ గిరిజా తిరందాస్‌ మాట్లాడుతూ గృహహింస నిరోధక చట్టాల పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని, అత్తవారింట్లో జరిగే మానసిక వేధింపుల నుండి …

Read More »

పెన్షనర్ల సమస్యలను పరిష్కరించండి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీర్ఘకాలంగా పెండిరగ్‌ లోనున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు పెన్షనర్లందరూ ఐక్యంగా పోరాటం చేయాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. శాస్త్రుల దత్తాద్రిరావు అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పలువురు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపటం లేదనీ, సకాలంలో పెన్షన్‌ రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, …

Read More »

ఆచార్య జయశంకర్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదాం

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ 88 వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జయంతి వేడుకకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా …

Read More »

వజ్రోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని చేపడుతున్న వజ్రోత్సవ వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 8 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »