nizamabad

ఇందూరు వాసులకు శుభవార్త

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 11వ తేదీ బుధవారం రోజు ఉదయం 9.30 గంటలకు నిజామాబాద్‌ నగరంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో సిటీ బస్సులు ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌, నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, నగర శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తతో టీఎస్‌ ఆర్టీసీ ప్రధాన బస్‌ స్టాండ్‌లో నిజామాబాద్‌ నగరంలో సిటీ బస్సులను ప్రారంభించనున్నారు. దీంతో …

Read More »

ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరగాలి

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రసవాలు అన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ విషయంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా మండలాల మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఒక్కో పి.హెచ్‌.సి వారీగా …

Read More »

పోలీస్‌ ఉద్యోగార్ధుల ముందస్తు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన పురుష అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ శాఖ సహకారంతో ఎడపల్లి మండలం జానకంపేట్‌లోని సీటీసీ కేంద్రంలో ముందస్తు శిక్షణ అందిస్తుండగా, శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. కేంద్రంలో అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. వారి …

Read More »

ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని విశ్వశాంతి జూనియర్‌ కాలేజీలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఆయా గదులలో తిరుగుతూ, పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా గమనించారు. విద్యార్థుల హాజరు గురించి కలెక్టర్‌ ఆరా తీయగా, 394 మందికి గాను మంగళవారం నాటి సెకండ్‌ ఇయర్‌ ఇంగ్లీష్‌ సబ్జెక్టు పరీక్షకు 386 మంది …

Read More »

దరఖాస్తులను ప్రజావాణి సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తూ వెంటదివెంట సంబంధిత సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 55 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, ఆదనపు …

Read More »

ఇంటర్‌ పరీక్షలు…. ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో సోమవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లీష్‌ పరీక్షలో జిల్లాలో ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు కాగా 822 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌తో పాటు, అధికారి రజీయుధిన్‌ నిజామాబాద్‌ పట్టణంలోని 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. మొత్తం 18,036 మంది విద్యార్థులకు గాను 17,214 మంది …

Read More »

మెడికల్‌ కాలేజీకి శరీరదానం ఆదర్శనీయం

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బొమ్మెర స్వరూప,ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (భర్త క్యాతం సిద్దిరాములు,న్యాయవాది, పౌర హక్కుల సంఘం, ప్రజాస్వామిక గొంతుక), కామారెడ్డి, క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ సోమవారం ఉదయం 3.20 నిమిషాలకు ఇంటి వద్ద మరణించారు. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, నిజామాబాద్‌ కు ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు …

Read More »

అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారుల తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద పరిపాలనాపరమైన అనుమతులు మంజూరైన పాఠశాలల్లో ఈ నెలాఖరులోగా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి ఏ ఒక్క పనీ పెండిరగ్‌ ఉండకూడదని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి …

Read More »

రెండో ఇంటర్‌ పరీక్షలు…. ఒకరిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదు

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ పరీక్షల్లో రెండవ రోజు జిల్లాలో ఒక విద్యార్థి పై మాల్‌ప్రాక్టీస్‌ కేసుల నమోదు కాగా 824 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 17,793 మంది విద్యార్థులకు గాను 16,899 మంది విద్యార్థులు హాజరుకాగా జనరల్‌ 15776 విద్యార్థులకు గాను 694 మంది విద్యార్థులు గైర్‌ హాజరు కాగా 15,082 విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్‌ 2017 మంది విద్యార్థులకు …

Read More »

సత్వరమే తాగునీటి సమస్య పరిష్కరించాలి

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని 5వ డివిజన్‌ బోర్గాం (పి) పరిధిలో తాగునీరు, విద్యుత్‌ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌, రూరల్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి సాయగౌడ్‌ మాట్లాడారు. 5వ డివిజన్‌ పరిధిలో గంగమ్మ గుడి కాలనీలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »