District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ వేడుకలకు అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా అధ్యక్షత వహించగా, జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి, మహాత్మా …

Read More »

ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. డిచ్పల్లి మండలం ధర్మారం, మెంట్రాజ్‌ పల్లి గ్రామాల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ శనివారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు …

Read More »

జిల్లా ప్రజలకు ప్రముఖుల రంజాన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా మండుటెండల్లోనూ ఎంతో నియమ నిష్ఠతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించారని అన్నారు. ఉపవాస దీక్షల పుణ్య ఫలంతో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్‌ …

Read More »

ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న లిప్రజావాణిలి కార్యక్రమాన్ని తాత్కాలికంగా లివాయిదాలి వేయడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్‌ బృందం జిల్లా పర్యటనకు విచ్చేస్తోందని, సమీకృత జిల్లా కార్యాలయాల …

Read More »

యూనిఫామ్‌ సర్వీస్‌లో ఫైర్‌శాఖ సేవలు అమోఘం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూనిఫామ్‌ సర్వీస్‌లోని అన్ని శాఖలతో పోలిస్తే అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలు ఆమోగమని జిల్లా ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి అన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా ఫైర్‌స్టేషన్లో ఏర్పాటుచేసిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యూనిఫాం సర్వీస్‌ అంటేనే నిరంతరం అప్రమత్తంగా ఉండటమేనని ఆయన గుర్తు చేశారు. …

Read More »

రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా పని చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు సూచించారు. బుధవారం జెడ్పి చైర్మన్‌ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలోని వివిధ అంశాలపై …

Read More »

ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న ఓపెన్‌ ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 25 నుండి మే 04వ తేదీ వరకు ఎస్‌ …

Read More »

క్షయ రహిత నిజామాబాద్‌ జిల్లా మన లక్ష్యం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా క్షయ నియంత్రణ విభాగం ద్వారా జిల్లాలో ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమాల్ని స్థానిక నిజామాబాద్‌ పట్టణంలోని న్యూ అంబేద్కర్‌ భవన్లో సోమవారం నిర్వహించారు. మేయర్‌ దండు నీతుకిరణ్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ పిఓడిటి ఆఫీసు నుండి ఖలీల్వాడిలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌ వరకు …

Read More »

ప్రజావాణికి 73 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్‌లకు విన్నవిస్తూ …

Read More »

అన్ని సమస్యల పరిష్కార మార్గం అంబెడ్కరిజమే

ప్రొఫెసర్‌ లింబాద్రి, చైర్మన్‌ ఉన్నత విద్యా మండలి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల పరిష్కారానికి అంబెడ్కర్జమే ఏకైక మార్గమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి స్పష్టం చేశారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాల ఏర్పాటు చేయడమంటే భవిష్యత్తుకు దిశ మార్గమని అన్నారు. ఆదివారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో బహుజన విద్యావంతుల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »