District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

జిల్లా విద్యార్థిని ల్యాప్‌టాప్‌ గెలుచుకుంది..

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బాబు జగజీవన్‌ రామ్‌, డాక్టర్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్ర మరియు వారు సాధించిన విజయాలు గురించి రాష్ట్ర స్థాయిలో వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. దానికి గాను నిజామాబాద్‌ జిల్లా విద్యార్థిని సునీత, 10 వ తరగతి, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం, వర్ని ` ఉపన్యాసపోటీలో మొదటి బహుమతి సాధించింది. …

Read More »

అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని భావి తరాలకు అందించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని భావితరాలకు అందించాలని వక్తలు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన గొప్ప మేధావి అంబేడ్కర్‌ అని కొనియాడారు. జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం లో అంబేడ్కర్‌ 132వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. …

Read More »

ఓటరు జాబితాలో పేరు తొలగించారనే ఫిర్యాదులు రాకూడదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏ ఒక్క ఓటరు నుండి కూడా ఫిర్యాదులు రాకుండా జాబితా పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. బుధవారం ఆయన ఎన్నికల జాబితా, బూత్‌ లెవెల్‌ అధికారుల నియామకం, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో …

Read More »

నిర్దిష్ట ప్రణాళికతో సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకెపి సీసీలు, రైస్‌ మిల్లర్లతో …

Read More »

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సభకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 14 వ తేదీన హైదరాబాద్‌ లో నిర్వహించతలపెట్టిన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా నుండి నియోజకవర్గాల వారీగా ప్రజలను తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సంబంధిత శాఖల …

Read More »

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు అర్బన్‌ శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తా అధ్యక్షత వహించగా, జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, …

Read More »

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో భారతరత్న డా బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా యువతీయువకులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్టు నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 14 డా.బీ ఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజున సుభాష్‌ నగర్‌లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నామని, పోటీలలో పాల్గొనే …

Read More »

భవన నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్‌ వద్ద చేపడుతున్న ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. నిజామాబాద్‌ నగరంలో ఏడు మైనారిటీ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో బాలికల కోసం ఒకే చోట ధర్మపురిహిల్స్‌ వద్ద నాలుగు స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటికే ఒకదాని నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. …

Read More »

ప్రజావాణికి 40 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 40 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు డీఆర్డీఓ చందర్‌, జెడ్పి సీఈఓ గోవింద్‌, నిజామాబాదు ఆర్దీఓ …

Read More »

నిజామాబాద్‌కు 29మంది సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించేందుకు 29 మంది సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లు రానున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో పెరుగుతున్న పేషెంట్లకు అనుగుణంగా మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లను ఏర్పాటు చేయనుందని అన్నారు. 29మంది …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »