నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందడంతో పాటు, దాని పరిధిలోని ప్రజల ఆర్ధిక, సామాజిక స్థితిగతులు మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అవార్డుల పంట పండుతోంది రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ దార్శనికత, సమర్ధవంతమైన నిర్ణయాలను క్షేత్ర స్థాయి వరకు పకడ్బందీగా …
Read More »రిజర్వాయర్ పనులను పరిశీలించిన స్పీకర్
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద సుమారు రూ.120 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న రిజర్వాయర్, కాలువల నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న పనులు కావడంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి …
Read More »విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముదక్ పల్లి పాఠశాలలో పదవతరగతి పరీక్ష రాయబోతున్న 48 మంది విద్యార్థులకు కాల్పోల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాము, ఉపాధ్యాయురాలు స్వప్న పరీక్షా సామాగ్రిని అందించారు. కార్యక్రమానికి అతిథిగా జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్ పాల్గొన్నారు. ముదక్ పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోశన్న మాట్లాడుతూ పరీక్షా సమయంలో విద్యార్థులకు కావలసిన సామాగ్రిని కాల్పోల్ పాఠశాల అధ్యాపక బృందం …
Read More »పెన్షనర్ల వినూత్న ధర్నా
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీర్ఘకాలంగా పెండిరగ్లోనున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు గోడుగులతో ధర్నా నిర్వహించారు. ప్రధానంగా పి.అర్. సి. కాల పరిమితి ముగిసినందున జూన్ 2023 నుండి అమలయ్యే విధంగా కొత్త పిఆర్సి కమిటీ …
Read More »రాహుల్ గాంధీపై అనర్హత వేటు… ప్రజాస్వామ్యానికే ప్రమాదం
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో రాహుల్ గాంధీ కుటుంబం పాత్ర ఎంతో ఉందని, దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని, నీరవ్ మోడీ, లలిత్ మోడీ భారతదేశ సంపదను దోచుకుని విదేశాలకు వెళితే దానిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై కేసు పెట్టడం సరైనది కాదని మాజీ మంత్రి …
Read More »అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలి
నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి సీజన్ అయినందున అగ్ని ప్రమాద ఘటనలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా …
Read More »నిజామాబాదుకు జాతీయ స్థాయిలో బంగారు పతకం
నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా క్షయ నియంత్రణ విభాగం ద్వారా జిల్లాలో విస్తృతంగా క్షయ నిర్మూలన కార్యక్రమాల్ని నిర్వహించి టీబీని, నూతన క్షయ వ్యాధిగ్రస్తులను 60 శాతం వరకు నిర్మూలించడం ద్వారా నిజామాబాద్ జిల్లాకి జాతీయ స్థాయిలో బంగారు పతకం అవార్డు వరించింది. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ …
Read More »‘పోడు’ పాస్ బుక్కులను క్షుణ్ణంగా పరిశీలించాలి
నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీలో ఆమోదం పొందిన క్లెయిమ్ల ప్రకారంగా రూపొందించిన పట్టా పాస్ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే అర్హులైన వారికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలను అందించేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని …
Read More »కవిత్వమే సమాజానికి వసంత హేతువు
నిజామాబాద్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కవిత్వమే సమాజానికి వసంత హేతువు అని ప్రముఖ కవి సభా సామ్రాట్ విపి చందన్ రావు అన్నారు. శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలు మరియు 26వ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ‘‘ వసంతాన్ని పిలుద్దాం రా’’ శీర్షికన కవి సమ్మేళనం …
Read More »ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
నిజామాబాద్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా …
Read More »