నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులు పెద్ద ఎత్తున సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చే ట్రేడర్లకు ఎవరు కూడా ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. ఒకవేళ ఎవరైనా ఆటంకాలు కల్పించినట్లు తమ దృష్టికి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక …
Read More »జాతీయ స్థాయి అవార్డులకు జీ.పీలు కృషి చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి అవార్డుల కోసం ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయనున్నందున, జిల్లాలోని మొత్తం 530 జీ.పీలు నామినేషన్ చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయి అవార్డుల కోసం నిర్దేశించిన తొమ్మిది అంశాల్లోనూ …
Read More »ట్రస్టులు విజ్ఞాన కేంద్రాలుగా వ్యవహరించాలి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక, విద్య, వైద్య,విజ్ఞానాన్ని అందించే విధంగా ట్రస్టులు వ్యవహరించాలని రాష్ట్ర వ్యాప్త ట్రస్టుల, విజ్ఞాన కేంద్రల కోఆర్డినేటర్ ఎం. సోమయ్య పిలుపునిచ్చారు. మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక డాక్టర్ రామ్ మోహన్ రావు అధ్యక్షతన గురువారం ట్రస్ట్ భవనములో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల,బాలికలకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే …
Read More »జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో (న్యూ కలేక్టరేట్) గల వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కో శాఖ వారీగా అధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా కొనసాగుతున్న సుధీర్ కుమార్ అనే ఉద్యోగి అనధికారికంగా విధులకు గైరుహాజరు కావడాన్ని …
Read More »నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా కార్యక్రమం
నిజామాబాద్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ 2 గాంధీ జయంతిన మొదలైన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి తిలక్ గార్డెన్లో, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ను సేకరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ మాట్లాడుతూ మన అలవాట్లే మన భవిష్యత్ను మారుస్తాయని, దేశాన్ని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని, తెలిసో …
Read More »నవంబర్ 15 నాటికి పనులన్నీ పూర్తి కావాలి
మాక్లూర్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని మాక్లుర్ మండలంలో గల చిన్నాపూర్ వద్ద గల అర్బన్ పార్క్ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం సందర్శించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పనులతో పాటు వివిధ దశల్లో కొనసాగుతున్న ప్రగతి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. ఓపెన్ జిమ్లు, ప్లే జోన్ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, రోడ్డు నిర్మాణాలను …
Read More »28న మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 28 న ఏఐటీయూసీ అనుబంధ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్టు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య తెలిపారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర మూడవ మహాసభలు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యూనియన్ రాష్ట్ర …
Read More »నగదు రహిత వైద్యాన్ని అందించాలి
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. హెల్త్ కార్డు నిరుపయోగంగా మారిందని ప్రైవేటు ఆసుపత్రులు అనుమతించడం లేదని, …
Read More »డ్రాగన్ ఫ్రూట్ పంట క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలం కంజర గ్రామంలో ఎండీ. తమీమ్ అనే ఆదర్శ రైతు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంట క్షేత్రాన్ని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం సందర్శించారు. రసాయనిక ఎరువులకు స్వస్తి పలికి, పూర్తిగా సేంద్రీయ పద్ధతులను అవలంభిస్తూ ప్రయోగాత్మకంగా ఎకరన్నర విస్తీర్ణంలో పండిస్తున్న పంట క్షేత్రాన్ని కలెక్టర్ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. డ్రాగన్ ఫ్రూట్ పండిరచడంలో పాటిస్తున్న …
Read More »ఆధార్ అప్ డేట్ చేసుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2010 నుండి 2016 సంవత్సరాల కాలంలో ఆధార్ కార్డు పొందిన వారందరూ తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని ఈ-సేవ జిల్లా మేనేజర్ కార్తీక్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు సేవలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు పైన పేర్కొన్న కాలంలో ఆధార్ పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. తమ పేరు, …
Read More »