నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో గల అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో గత ఆగస్టు మాసంలో జరిగిన కాన్పుల వివరాలను సమగ్ర పరిశీలనతో సేకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లెక్కకు మించి జరుగుతున్న సీజీరియన్ల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ గత కొన్ని నెలల నుండి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలు …
Read More »అన్ని కేటగిరీల వారికి జీవన భృతిని ఇవ్వాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ ప్యాకర్లకు, నెలసరి జీతాల ఉద్యోగులకు, బీడీ కమిషన్ దారులకు సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానం ప్రకారం జీవన భృతిని ఇవ్వాలంటూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, ధర్నా చేసి, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు …
Read More »పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘురాం నాయక్, జిల్లా అధ్యక్షులుఅంజలి డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలో సోమవారం అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులపై …
Read More »ప్రజావాణికి 55 ఫిర్యాదులు
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 55 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ …
Read More »ధూం..దాంగా సాగిన సాంస్కృతిక ప్రదర్శనలు
నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల న్యూ అంబేడ్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధూం.. దాంగా సాగాయి. కళాకారులు, చిన్నారుల ప్రదర్శనలను ఆద్యంతం తిలకించిన ముఖ్య అతిథులు, ఆహుతులు కరతాళధ్వనులతో అభినందించారు. స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి …
Read More »విశ్వబ్రాహ్మణ కులస్థుల అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తాం
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వబ్రాహ్మణ కులస్థుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతూ, వారి అభ్యున్నతికై జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య …
Read More »ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ సంబరాలు
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. వజ్రోత్సవాల ప్రారంభోత్సవ సూచికగా జరుపుకుంటున్న వేడుకలు కావడంతో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెడ్పి చైర్మన్ దాదన్నగారి …
Read More »సాహిత్యానికి వెన్నుదన్ను గన్ను కృష్ణమూర్తి
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కవి గన్ను కృష్ణమూర్తి ఆధునిక భావాలు కలిగిన కవి అని, మినీ కవిత్వంలో, రామాయణ పరిశోధనలో నూతన పంథాను సృష్టించాడని హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్ నివాళి అర్పించారు. గురువారం సాయంత్రం కేర్ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి రామాయణ పరిశోధకులు వక్త, వ్యాఖ్యాత సౌజన్యమూర్తి …
Read More »ఆదివాసి గిరిజన సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 17న ముఖ్యమంత్రి చేతుల మీదుగా హైదరాబాద్లో ప్రారంభించనున్న ఆదివాసి భవన్, బంజారా భవన్కు సంబంధించిన పోస్టర్ను గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తన చాంబర్లో అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆదివాసి గిరిజన సమ్మేళనానికి జిల్లా …
Read More »తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను కార్యోన్ముఖులు చేశారు. బుధవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) లోని స్టేట్ ఛాంబర్లో జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ …
Read More »