District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై డీజీపీ మహేందర్‌ రెడ్డితో కలిసి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా …

Read More »

నులి పురుగుల నివారణ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులతో పాటు కలెక్టర్‌ సైతం భాగస్వాములయ్యారు. 1 – 19 సంవత్సరాల వయస్సు గల వారందరికీ నులి పురుగుల నివారణ …

Read More »

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన ప్రాధాన్యతను చాటేలా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జిల్లాలో విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. వజ్రోత్సవాల నిర్వహణకు సంబంధించి మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ …

Read More »

జాతీయ స్థాయి అవార్డుల సాధనకు కృషి చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులను నిజామాబాద్‌ జిల్లా ఎక్కువ సంఖ్యలో సాధించేలా ఆయా శాఖల అధికారులు సమిష్టిగా, పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, 9 అంశాల ప్రాతిపదికన …

Read More »

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యు) నగర నిర్మాణ జనరల్‌ బాడీ సమావేశం నగరంలోని కోటగల్లి, ఎన్‌ఆర్‌ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యవక్తగా విచ్చేసిన సీనియర్‌ జర్నలిస్ట్‌, అధ్యాపకుడు, పి.డి.ఎస్‌.యు మాజీ జిల్లా కార్యదర్శి కొంగర శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలని కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి గర్భిణీలకు సూచించారు. మోపాల్‌ వసతి గృహం ఆకస్మిక తనిఖీ చేసి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంగా 102 అంబులెన్సులో గర్భిణీ మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు జరిపించేందుకు తీసుకెళ్తుండడాన్ని గమనించిన కలెక్టర్‌ వాహనాన్ని నిలిపి, ఆశా వర్కర్లకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలతో కూడిన ఉచిత …

Read More »

రెసిడెన్షియల్‌ స్కూల్‌… వసతి గృహం తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండలం కంజర గ్రామంలో గల ప్రభుత్వ సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌, మోపాల్‌ లోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా కంజర రెసిడెన్షియల్‌ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్‌, అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. కిచెన్‌, డార్మెటరీ, స్టోర్‌ రూమ్‌, టాయిలెట్స్‌ వద్ద గల వసతులను స్వయంగా …

Read More »

అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేస్తాము

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని 4డివిజన్ల పరిధిలో సుమారు 60లక్షల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించినట్లు నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ తెలిపారు. అభివృద్ధి పనులప్రారంభోత్సవ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగర ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త పార్టీలకు అతీతంగా నగర అభివృద్దే లక్ష్యంగా అన్ని ప్రాంతాల, డివిజన్ల అభివృద్దికై నిధులను …

Read More »

ఇరవై దేశాల సి-20 సమావేశంలో ప్రసంగించిన భారత ప్రతినిధి మంద భీంరెడ్డి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 13, 14 న జి-20 దేశాల కార్మిక మంత్రుల స్థాయి సదస్సు జరుగనున్న నేపథ్యంలో వలస కార్మికుల అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం సోమవారం ఇండోనేషియాలోని ‘మైగ్రెంట్‌ కేర్‌’ అనే సంస్థ సి-20 అనే సివిల్‌ సొసైటీ ఆర్గనైజేషన్స్‌ (సభ్య సమాజ సంస్థలు) సమాంతర సమావేశాన్ని (సైడ్‌ ఈవెంట్‌) ను నిర్వహించింది. సమావేశాన్ని హైబ్రిడ్‌ మోడ్‌ (మిశ్రమ …

Read More »

న్యూ కలెక్టరేట్‌లో ప్రజావాణికి విశేష స్పందన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం న్యూ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. న్యూ కలెక్టరేట్‌లో మొట్టమొదటి కార్యక్రమం అయినప్పటికీ జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సమస్యలపై అర్జీలు సమర్పించారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలను నివేదిస్తూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »