District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజల నేస్తం

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌లో ఆరు గ్యారంటీ దరఖాస్తు స్వీకరణను మాజీ మంత్రి, నిజామాబాద్‌ అర్బన్‌ ఇంచార్జ్‌ మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది దొరల ప్రభుత్వం కాదని, ప్రజల ప్రభుత్వం అని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అర్హత ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గత పాలకుల …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జనవరి 5, 2024శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 7.49 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : చిత్ర సాయంత్రం 4.45 వరకుయోగం : సుకర్మ తెల్లవారుజామున 4.23 వరకుకరణం : తైతుల ఉదయం 6.43 వరకు తదుపరి గరజి రాత్రి 7.49 వరకు వర్జ్యం : రాత్రి 10.43 – 12.25దుర్ముహూర్తము : …

Read More »

దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పాలన కార్యక్రమం సందర్భంగా ప్రజలు అందిస్తున్న దరఖాస్తుల వివరాలను ఆన్‌ లైన్‌ లో నమోదు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జక్రాన్పల్లి మండలం పడకల్‌ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టర్‌ గురువారం సందర్శించారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న తీరుతెన్నులను, రిజిస్టర్లలో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. ప్రజలకు దరఖాస్తుఫారాలు …

Read More »

సమాజానికి తోడ్పాటును అందించాలనే తపనతో ముందుకు సాగాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని, ఆ దిశగా ముందుకు సాగినప్పుడే అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన సమాజం ఆవిష్కృతం అవుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ ఉద్బోధించారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్పల్లి మండల కేంద్రంలో మన ఊరు – మన బడి కార్యక్రమం కింద రూ. 62.77 లక్షల …

Read More »

అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 2047 నాటికి దేశాన్ని వికసిత్‌ భారత్‌గా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేద్దామని, అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధనపాల్‌ సూర్యనారాయణ గుప్త సూచించారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద ‘‘వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర’’ను నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జనవరి 4, 2024శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి సాయంత్రం 6.23 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : హస్త మధ్యాహ్నం 2.48 వరకుయోగం : అతిగండ తెల్లవారుజాము 4.35 వరకుకరణం : కౌలువ సాయంత్రం 6.23 వరకు వర్జ్యం : రాత్రి 11.27 – 1.11దుర్ముహూర్తము : ఉదయం 10.15 – 10.59మధ్యాహ్నం 2.39 …

Read More »

ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్‌ రూరల్‌ శాసన సభ్యులు డాక్టర్‌ ఆర్‌.భూపతి రెడ్డి సూచించారు. డిచ్పల్లి మండలం దూస్‌ గాంలో బుధవారం కొనసాగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజల …

Read More »

గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వంద శాతం లబ్దిదారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి.ధర్మ నాయక్‌ తెలిపారు. బుధవారం నిజామాబాద్‌ పట్టణంలోని ధర్నా చౌక్‌ వద్ద వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ …

Read More »

ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి అనుమతి లేకుండా అనధికారికంగా విధులకు గైర్హాజరు అవుతున్న ఉపాధ్యాయుడికి ఫైనల్‌ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌ వి దుర్గాప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు వెలువరించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే అబ్దుల్‌ ఖయ్యూం అనే ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు జారీ అయ్యింది. సదరు …

Read More »

సావిత్రిబాయి పూలే చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్పించాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే 193వ జయంతి వేడుకలు నిర్వహించారు. కేవలం బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా అగ్ర వర్ణాల నిరుపేదలకు కూడ తాను స్థాపించిన పాఠశాలలో 150 సంవత్సరాల క్రిందటే చదువు నేర్పిన గొప్ప దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే అని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »