వేల్పూర్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డిజిటల్ బోర్డులు, వంటపాత్రలు వితరణ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ కె. ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ సేవలు అందిస్తున్నామని తెలిపారు. అసిస్టెంట్ గవర్నర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ, పిల్లలు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని …
Read More »చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలి
గాంధారి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం తాను దత్తత తీసుకున్న గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. మార్చ్ ఫాస్ట్ ద్వారా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల ఆవరణలో క్రీడా మైదానాన్ని పరిశీలించారు. క్రీడా మైదానంలో …
Read More »అర్జున్కు డాక్టరేట్
డిచ్పల్లి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి పర్యవేక్షణలో దొండి అర్జున్ పరిశోధన చేసిన జానపద సాహిత్యంలో స్త్రీ పాత్ర చిత్రణ సమగ్ర పరిశీలన అనే అంశంపై సోమవారం మౌఖిక పరీక్ష నిర్వహించారు. హుమానిటీస్ సెమినార్ హాల్లో జరిగిన పరీక్షకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఆచార్యులు డాక్టర్ గోనానాయక్ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. దొండి అర్జున్ …
Read More »ప్రశాంతంగా ప్రారంభమైన పిజి పరీక్షలు
డిచ్పల్లి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల పిజి మొదటి సంవత్సర రెండవ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా పరీక్షగా కేంద్రాలను విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ, కాన్ఫిడెన్సియల్ అధికారి సాయిలు, విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు సహాయ ఆచార్య నాగరాజు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయగౌడ్ తదితరులు పరీక్షించారు. ఉదయం జరిగిన పరీక్షలో మొత్తం విద్యార్థులు …
Read More »మంత్రి, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దహనం
కామారెడ్డి, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు ఇందిరా గాంధీ చౌక్ వద్ద తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ యువజన పట్టణ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సిలబస్ పూర్తి …
Read More »రాష్ట్రంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ…
హైదరాబాద్, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపరిచిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో డిగ్రీ పూర్తయిన తర్వాతే బీఈడీ చదివేందుకు వీలుండేది. ఇక నుంచి ఇంటర్ పూర్తయిన విద్యార్థులు కూడా ఉపాధ్యాయ విద్యలోకి ప్రవేశించవచ్చు. నారాయణపేటలోని శ్రీదత్త బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులకు జాతీయ …
Read More »రఘుపతికి డాక్టరేట్
డిచ్పల్లి, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగపు పరిశోధకులు దాసమ్ రఘుపతికి పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో అసోషియేట్ ప్రొఫెసర్ డా. కె. అపర్ణ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి దాసమ్ రఘుపతి ది ఫర్ఫామెన్స్ ఆఫ్ సెక్టోరల్ ఇండిసెస్ ఎట్ బియస్సి అండ్ యన్యస్సి అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత …
Read More »దరఖాస్తులకు గడువు పొడిగింపు
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐ విద్యార్థులకు ప్రవేశం పొందాలనుకునేవారు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు కన్వీనర్, బాలుర ఐటిఐ ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ ట్రేడ్లలో మెరిట్ ప్రాతిపదికన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని సీటు పొందగలరని అన్నారు. మరిన్ని వివరాలకు ఐటిఐ తెలంగాణ వెబ్సైట్లో సందర్శించాలన్నారు.
Read More »యుజి సెమిస్టర్ ఫలితాల విడుదల
డిచ్పల్లి, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యుజి 3వ, 4వ సెమిస్టర్ ఫలితాలు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్త ఛాంబర్లో వారి చేతుల మీదుగా మంగళవారం విడుదల చేశారు. కాగా రిజిస్ట్రార్ ఆచార్య శివశంకర్, పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య అరుణ, డా. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయగౌడ్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 3వ సెమిస్టర్లో 9 వేల 727 మంది పరీక్షలకు హాజరు …
Read More »ఆంగ్లశాఖలో సుకుమార్కు పిహెచ్డి
డిచ్పల్లి, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రమణాచారి పర్యవేక్షణలో డైనాలాజిక్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ దా నవల్స్ ఆఫ్ గీత హరిహరన్ అనే అంశం పైన గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న జాన్ సుకుమార్ పరిశోధన పత్రం సమర్పించారు. మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్లో జరిగిన పిహెచ్డి వైవా …
Read More »