Education

వసతి గృహాల చీఫ్‌ వార్డెన్‌గా డా. అబ్దుల్‌ ఖవి

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలములోని వసతి గృహాలకు చీఫ్‌ వార్డెన్‌ గా డా. అబ్దుల్‌ ఖవిని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశాలతో రిజిష్ట్రార్‌ ఆచార్య యాదగిరి నియమించారు. నియామక పత్రాన్ని ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ అబ్దుల్‌ ఖవికి అందజేశారు. గతంలో అబ్దుల్‌ ఖవి అసిస్టెంట్‌ పి.ఆర్‌.ఓ., హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్‌ గాను, వార్డెన్‌, పరీక్షల విభాగంలో అడిషనల్‌ కంట్రోలర్‌గాను పని …

Read More »

తె.యూ పాలకమండలి సభ్యులకు పి.డి.ఎస్‌.యు ఫిర్యాదు

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని మంగళవారం పాలక మండలి సభ్యులు మారయ్య గౌడ్‌, వసుంధరాదేవి, రవీందర్‌ రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌లను కలిసి పి.డి.ఎస్‌.యు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌ కల్పన మాట్లాడుతూ టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్టు గత పాలకమండలి సమావేశం …

Read More »

తెయు ఉపకులపతికి సన్మానం

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇప్పటివరకు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అకడమిక్‌ కన్సల్టెంట్‌గా ఉన్న పేరును అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా మార్చడంతో తమ సంతోషాన్ని ఉపకులపతితో పంచుకున్నారు. ఈ సందర్బంగా ఇటీవలే ప్రపంచస్థాయి రెండవ ర్యాంకింగ్‌ కేటగిరీలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. డి. రవీందర్‌ గుప్తకి స్థానం లభించడం గర్వకారణమని, తెలంగాణ విశ్వవిద్యాలయము పేరు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని అసిస్టెంట్‌ …

Read More »

సమస్యల వలయంలో ఆర్మూర్‌ ప్రభుత్వ పాఠశాలలు

ఆర్మూర్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూరు మండల కార్యదర్శి సిద్ధాల నాగరాజు ముఖ్య అతిథులు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఏడు సంవత్సరాల నుండి విద్యారంగాన్ని విస్మరించిందని అన్నారు. అదేవిధంగా ఖాళీగా …

Read More »

కలెక్టర్‌ను కలసిన తెయు ఉపకులపతి

డిచ్‌పల్లి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ నిజామాబాద్‌ జిల్లా కలక్టర్‌ సి. నారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధికి సహకరించాలని తెయూ ఉపకులపతి ఆచార్య డి రవీందర్‌ గుప్తా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ని సన్మానించారు.

Read More »

అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల

ఆర్మూర్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న నరేంద్ర డిగ్రీ కళాశాల యుజిసి నియామకాలను పాటించకుండా విద్యార్థుల దగ్గరనుండి విచ్చలవిడిగా ఫీజు వసూలు చేయడం జరుగుతుందని గతంలో కూడా విద్యార్థుల సర్టిఫికెట్‌లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం జరిగిందని ఏబివిపి నాయకులు వినయ్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో …

Read More »

యూనివర్సిటీ అక్రమాలపై విచారణ జరపాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రికి వినతి పత్రం అందించారు. అదే విధంగా యూనివర్సిటీ అక్రమాలపై ప్రత్యేక కమిటీ వేసి అర్హతలు లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత విద్యా మండలి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని అక్రమార్కుల నుండి రక్షించాలని కోరారు. అలాగే తెలంగాణ …

Read More »

కెసిఆర్‌ అసమర్థత వల్లే రైతులకు ఇబ్బందులు…

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేయాల్సింది నిరుద్యోగులు విద్యార్థులు అని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు అన్నారు. కేసీఆర్‌ రైతులు పండిరచిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడి రైతులు పండిరచిన ధాన్యం నాని పోవడం జరిగిందని దీనికి పూర్తి బాధ్యత …

Read More »

డిసెంబర్‌ 1 నుండి ఉచిత గ్రూప్స్‌ కోచింగ్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ముద్దుబిడ్డ, మాజీ కలెక్టర్‌ చిరంజీవులు ఐ.ఏ.ఎస్‌, యుబియుఎన్‌టియు సామాజిక సేవా సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా ఉచితంగా గ్రూప్స్‌ కోచింగ్‌ ఇవ్వడానికి ముందుకొచ్చారు. కోచింగ్‌ పొందాలనుకునేవారు ఉదయం టీ, మధ్యాహ్నం బోజనం, సాయంత్రం టీ స్నాక్స్‌ కొరకు రోజుకు 35 రూపాయల చొప్పున విద్యార్థులు చెల్లించవలసి ఉంటుందని, 100 మంది యువకులకు, 100 మంది యువతులకు …

Read More »

ఈనెల 30 వరకు రీ అడ్మిషన్‌ గడువు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ, పి.జిలో చేరి మధ్యలో చదువు ఆపేసిన వారు ఈనెల 30వ తేదీలోపు రీ అడ్మిషన్‌ తీసుకోవచ్చని ప్రాంతీయ అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ 1999 నుంచి 2011 సంవత్సరం మధ్యన అడ్మిషన్‌ తీసుకుని పూర్తిచేయనివారు, రీ అడ్మిషన్‌ తీసుకుని డిసెంబర్‌లో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »