Breaking News

Education

ఎస్‌ఎస్‌కె సమాజ్‌ ఆద్వర్యంలో ప్రతిభా పురస్కారాలు

ఆర్మూర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఎస్‌కె సమాజ్‌ ఆర్మూర్‌ వారి అధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రాంతీయ సమాజ్‌ అధ్యక్షుడు విశ్వనాథ్‌ రవీందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పండిత్‌ వినితపవన్‌ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సమాజ్‌ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌ రవీందర్‌ ఆర్మూర్‌ సమాజం విద్యార్థులకు ప్రోత్సాహక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, …

Read More »

ఉపాధ్యాయుల సమస్య పరిష్కరానికి కృషి చేయాలి

ఆర్మూర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చేపూర్‌ ఉపాధ్యాయులు సంగెం అశోక్‌ ఉపాధ్యాయుల ప్రధాన సంఘం పిఆర్‌టియు మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా సంగెం అశోక్‌ను చెపూర్‌ గ్రామ సర్పంచ్‌ టీసి సాయన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవ రెడ్డి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ సాయన్న మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయుల …

Read More »

ఖిల్లా జూనియర్‌ కళాశాలలో రిక్రూట్‌ మెంట్‌ డ్రైవ్‌

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్లోని ఎంఎస్‌ఎన్‌ లాబొరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో టెక్నికల్‌ ట్రైని ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్మెంట్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేశామని డిఐఈఓ రఘురాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ ఖిల్లా జూనియర్‌ కళాశాలలో మంగళవారం ఉదయం రిక్రూట్మెంట్‌ డ్రైవ్‌ జరుగుతుందని అన్నారు. 2022, 2023 సంవత్సరాలలో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ బైపీసీ ఫార్మా టెక్‌ కోర్సులలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు నేరుగా …

Read More »

అతిధి అధ్యాపకులకు దరఖాస్తులకు ఆహ్వానం

బాన్సువాడ, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఇందుర్‌ గంగాధర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత …

Read More »

నోటు పుస్తకాల పంపిణీ

కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆచార్య స్వామి ప్రణవానంద మహారాజు ఆశీస్సులతో భారత సేవాశ్రమ సంఘం ప్రతినిధి వెంకటేశ్వర నంద ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు 30 వేల నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని దేవునిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి చదివి …

Read More »

నిప్పులు కురిసిన దాశరథి…

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్‌ జిల్లా, మానుకోట తాలూకా, చినగూడూరులో పుట్టారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి వెంకటమ్మ, దాశరథి వెంకటాచార్యులు.దాశరథికి మొదటి గురువు వారి తండ్రిగారే. ఆతడు సంస్కృత విద్వాంసులు. తెలుగు, తమిళంలో కూడా మంచి పాండిత్యం గలవారు. తెలుగు సాహిత్యం మీద దాశరథికి ఆసక్తిని కలిగించింది వారి తల్లిగారు. అలా చిన్నతనంలోనే దాశరథికి సాహిత్యాభిలాష పెరిగింది. పండిత కుటుంబమే గాని సంపన్న కుటుంబం కాదు. …

Read More »

మహాకవి… దాశరథి

మహాకవి దాశరథి జీవితం ఆదర్శప్రాయం. తన రచనతో సాహిత్యంలో ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ప్రతి ఒక్కరి హృదయాలపై తనదైన ముద్రను వేశారు. ఈ సందర్భంగా ప్రజాకవి దాశరథి తన సాహిత్యంలో స్త్రీల పాత్రలను మలచిన తీరు ప్రశంసించదగినది. ఆయన రచించిన మహాశిల్పి జక్కన, స్వాతంత్య్ర వాహిని, నేనొక్కణ్ణేకాదు, యశోధర.. అనే నాటికలను పరిశీలిస్తే మనకు అనేక విషయాలు గోచరిస్తాయి. …

Read More »

ఐటీ హబ్‌లో ప్రైవేట్‌ జాబ్‌మేళాలు సరే.. మరి ప్రభుత్వ ఉద్యోగాల మాటేమిటి

జక్రాన్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగులను మభ్య పెట్టడానికే ఐటిహబ్‌ పేరుతో రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారని మండల యువజన విభాగం అధ్యక్షుడు సొప్పరి వినోద్‌ విమర్శించారు. జక్రాన్‌పల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జక్రాన్‌పల్లి మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సొప్పరీ వినోద్‌ మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ యువత కోసం బిఆర్‌ఎస్‌ …

Read More »

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక పూర్తి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పధకం క్రింది 1వ, 5వ తరగతిలో ప్రవేశాలకై గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తల్లిదండ్రుల సమక్షంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. 1వ తరగతిలో 64 సీట్లకు, 70 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా లక్కీ డ్రా ద్వారా …

Read More »

అతిధి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులలో ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌ ఆదేశం మేరకు అతిథి ఆధ్యాపకులను నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్య అధికారి రఘురాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొత్తం 58 పోస్టులలో అతిథి ఆధ్యాపకుల నియమాకానికి ఈ నెల 24వ తేదీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »