Breaking News

Education

గురుకులాల్లో ప్రవేశాల గడువు పొడగింపు

హైదరాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి గడువును ఈ నెల 15 వరకు అధికారులు పొడిగించారు. ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయసంస్థ కార్యదర్శి రోనాల్డ్‌ రోజ్‌ శనివారం వెల్లడిరచారు. గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు కామన్‌ ఎంట్రన్స్‌ను నిర్వహించడంతోపాటు అర్హత సాధించిన విద్యార్థుల మొదటి జాబితాను …

Read More »

14 నుండి అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు

కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14 నుంచి 22 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శుక్రవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్షల సమయంలో జిరాక్స్‌ సెంటర్లు మూసి ఉంచాలని …

Read More »

రాష్ట్రస్థాయి కవిసమ్మేళనానికి కాసర్ల

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పద్య కవిసమ్మేళంలో పాల్గొని, సత్కారం అందుకోవల్సిందిగా ఇందూరు జిల్లా ప్రముఖకవి డా.కాసర్ల నరేశ్‌ రావుకు అకాడమి ఆహ్వానం పలికింది. ఆదివారం హైద్రాబాద్‌ లోని రవీంద్రభారతిలో జరిగే కవిసమ్మేళనంలో కాసర్ల పాల్గొననున్నారు.

Read More »

తెలంగాణలో 12 కొత్త కాలేజీలు

హైదరాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 5, తెలంగాణకు 12 కొత్త కాలేజీలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో మొదలవుతాయని …

Read More »

డిగ్రీ ప్రవేశాల కోసం స్పెషల్‌ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్‌ పరిశీలన

డిచ్‌పల్లి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి (దోస్త్‌ 2023) స్పెషల్‌ కేటగిరికి సంబంధించిన పిహెచ్‌ / సిఏపి అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఈ నెల 8వ తేదీన టీయు పరిపాలన భవనంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ అకాడమిక్‌ ఆడిట్‌ కార్యాలయంలో జరుగుతుందని సంబంధిత విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలంగాణ యూనివర్సిటీ దోస్తు కోఆర్డినేటర్‌ సంపత్‌ …

Read More »

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్కీ డ్రా ద్వారా 45 మంది గిరిజన విద్యార్థుల ఎంపిక చేపట్టారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం 3, 5,8 బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ కోసం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. మూడవ తరగతికి 15 మంది బాలురు, 8 మంది బాలికలను ఎంపిక చేశారు. ఐదవ తరగతికి …

Read More »

8వరకు పరీక్ష ఫీజు గడవు

డిచ్‌పల్లి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్స్‌ (5వైఐపిజిపి ఏపిఇ / పిసిహెచ్‌) లకు చెందిన 8వ, 10వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు బ్యాక్‌ లగ్‌ థియరీ మరియు ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 6 తేదీ చివరి తేది ఉండగా ఈ నెల 8వ తేదీ కీ గడువు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి …

Read More »

గ్రూప్‌ 1 అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న జరిగే గ్రూపు -1 పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్లోడ్‌ చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం పరీక్షల నిర్వహణపై లైజన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో 24 మంది అభ్యర్థులు ఉండేవిధంగా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని …

Read More »

బాసరలో కవి సమ్మేళనము

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ బాసర ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సకల కలల వరప్రదాయిని బాసర జ్ఞాన సరస్వతి ప్రాంగణంలో ఏదేని ఒక సామాజిక అంశంపై కవి సమ్మేళనం ఉంటుందని అఖిలభారత రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్‌ …

Read More »

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

బాన్సువాడ, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ శ్రీరామ్‌ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ గంగాధర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని అందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా 85 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »