Education

ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి లేదు

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్నిమరింతగా ఇనుమడిరపజేయాలని పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ …

Read More »

నాపా అధ్యక్షులు కర్నాటి ఆంజనేయులును కలిసిన వీసీ

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో నార్త్‌ అమెరికా పద్మశాలి అసోసియేషన్‌ అధ్యక్షులు కర్నాటి ఆంజనేయులును మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్‌ వీవర్స్‌ ఆర్గనైజేషన్స్‌ చైర్మన్‌ (డబ్ల్యూడబ్ల్యూఒ) గా ఉన్న కర్నాటి ఆంజనేయులు ఆధ్వర్యంలో శనివారం నారాయణ గూడలోని పద్మశాలి భవనంలో …

Read More »

సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జూనియర్‌ రెడ్‌ క్రాస్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌ సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి పాఠశాల నుంచి జూనియర్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌లలో విద్యార్థులను సభ్యులను ఉపాధ్యాయులు చేయించాలని సూచించారు. సామాజిక …

Read More »

వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో తొలిమెట్టు మౌలిక భాష గణిత సామర్ధ్యాల సాధన కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి మెట్టు కార్యక్రమాన్ని …

Read More »

విద్యానికేతన్‌ పాఠశాల బస్సుల అనుమతిని రద్దు చేయాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సరంపల్లి గ్రామంలో గల విద్యానికేతన్‌ పాఠశాల చెందిన బస్సులను పట్టణంలోని అశోక్‌ నగర్‌ కాలనీ ఇతర ప్రాంతాల్లో మితిమీరిన వేగంతో నడపడం జరుగుతుందని కనీస అవగాహన లేని వ్యక్తులను బస్సు డ్రైవర్లుగా నియమించుకోవడం వల్లనే ఇష్టానుసారంగా బస్సులను నడిపించడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా రవాణా అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాలకు చెందిన బస్సులను అనుమతులను …

Read More »

టియు డీన్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌గా ఆచార్య సత్యనారాయణ

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ డీన్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌గా ఆచార్య సత్యనారాయణని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య దాచేపల్లి రవీందర్‌ గుప్త ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య విధ్యావర్ధిని నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆచార్య వి సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవిని ఇచ్చినందుకు వి.సి., రిజిస్ట్రార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహాయంతో తే.యు.ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేయుటకు …

Read More »

సంవత్సరం పాటు అధికారుల కాలపరిమితి పెంపు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న వివిధ పరిపాలన అధికారుల కాల పరిమితిని ఒక సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్టు వైస్‌ చాన్సలర్‌ ఆచార్య రవీందర్‌ గుప్తా తెలిపారు. ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ గా ఆచార్య విధ్యావర్డిని, పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా డా. సాయిలు, కాంపిటీటివ్‌ సెల్‌ డైరెక్టర్‌గా డా. జి. బాల …

Read More »

ఫీజుల పెంపు జీవో 37 ఉపసంహరించుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగ్‌లో ఉన్న 2 వేల 7 వందల కోట్ల బోధన, ఉపకార వేతన రుసుములను సత్వరమే విద్యార్థులకు విడుదల చేయాలని, ఇటీవల ఇంజనీరింగ్‌ ఫీజులను పెంచుతూ విడుదల చేసిన జీవో 37 ను ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు నవీన్‌, వంశీ డిమాండ్‌ చేశారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో …

Read More »

ఎస్‌.ఆర్‌.కె. విద్యార్థులను సన్మానించిన యూనివర్సిటీ రిజిస్ట్రార్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ గురువారం ప్రకటించిన డిగ్రీ నాల్గవ సెమిస్టర్‌ ఫలితాలలో బిటిబిసిలో 10/10 జీపీఏ సాధించిన కె.రాహుల్‌, ఎస్‌.తబస్సుమ్‌ అలాగే ఎంఎస్టిసిఎస్‌ సెకండ్‌ సెమిస్టర్‌లో వి భరణి 9.80 జిపిఏ సాధించిన వారిని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ విద్యావర్దిని సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బాగా కష్టపడి చదవాలని, ఇప్పుడు అన్ని రకాలుగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో …

Read More »

పెంచిన ఇంజనీరింగ్‌ కాలేజీ ఫీజులు తగ్గించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఫీజులను పెంచడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని, వెంటనే పెంచిన ఫీజులు తగ్గించాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు అంజలి డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్‌ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజలి, రఘురాం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »