Education

తెలంగాణ యూనివర్సిటీ టాప్‌ర్యాంకులో నిలవాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్‌ (చాన్స్‌లర్‌) డా. తమిళి సై సౌందర రాజన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు. మొదట పరిపాలనా భవనానికి విచ్చేసిన గవర్నర్‌కు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌, అదనపు కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ స్వాగతం పలికి ఆహ్వానించారు. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) కో – ఆర్డినేటర్‌ …

Read More »

టిీయూలో ఘనంగా జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలు

డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో శనివారం ఉదయం డా. కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ 88 వ జయంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరై కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి వందనం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ జాతిపిత డా. కొత్తపల్లి జయశంకర్‌ …

Read More »

రేపు టియును సందర్శించనున్న గవర్నర్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్‌ డా. తమిళిసై సౌందర రాజన్‌ ఆగస్ట్‌ 7 వ తేదీ ఆదివారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది వరకే విద్యార్థి నాయకులందరు గవర్నర్‌ని కలుసుకొని తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలను సందర్శించాలని వారు కోరడం మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. విశ్వవిద్యాలయాల …

Read More »

పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7న జరిగే ఎస్‌ఐ పరీక్షకు ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో ఎస్సై పరీక్ష పై సమీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలు మూసి వేయించాలని సూచించారు. అభ్యర్థులు ఉదయం తొమ్మిది …

Read More »

నాలుగో రోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నాలుగో రోజు ఉదయం, మధ్యాహ్నం ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సరం గణితం, జీవశాస్త్రం, చరిత్ర, సబ్జెక్టు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ ఉదయం ఆర్మూర్‌, బాల్కొండ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే మధ్యాహ్నం నిజామాబాద్‌లోని పలు కళాశాలలు తనిఖీ చేసి సమీక్షించారు. ఉదయం …

Read More »

ప్రణాళికతో చదివితే విజయం మీదే

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళికతో చదివితే విజయం మీదే అవుతుందని, పట్టుదలతో ఇష్టపడి చదవాలని, అంకిత భావంతో చదువుతేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి మందిరంలో బుధవారం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మార్గ నిర్దేశం చేశారు. ఉద్యోగ సాధనలో …

Read More »

రామన్నపేటలో అష్టావధానం

వేల్పూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంలోని రామన్నపేట్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అష్టావధానం కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్‌ తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన అవధాన విద్యా వాచస్పతి, విశ్రాంత మండల విద్యాధికారిచే అష్ఠావధానం ఉంటుందని తెలిపారు. అవధానంలో నిషిద్దాక్షరి, సమస్య పూరణం, …

Read More »

రెండవ రోజు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతం

నిజామాబాద్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం రెండవ రోజు ఉదయం, మధ్యాహ్నం ఇంగ్లీషు సబ్జెక్టు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ నిజామాబాద్‌ పట్టణంలోని నాగారం మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలను, విశ్వశాంతి జూనియర్‌ కళాశాలను, కాకతీయ జూనియర్‌ కళాశాలలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే మధ్యాహ్నం నిజామాబాద్‌ బాలుర జూనియర్‌ కళాశాల (ఖిల్లా), …

Read More »

సివిల్స్‌ ర్యాంకర్లు జిల్లాకే గర్వకారణం

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కార్యాలయాల సముదాయమంలో కామారెడ్డి టి.ఎన్‌.జి.ఓస్‌ జిల్లా కార్యదర్శి బి.సాయిలు ఆధ్వర్యంలో సివిల్స్‌లో ర్యాంక్‌ సాధించిన సన్మాన గ్రహీతల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ అండ్‌ మేజిస్ట్రేట్‌ జితేష్‌ వి.పాటిల్‌ సమక్షంలో ఘనంగా సన్మానించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పద్మ పే అండ్‌ అకౌంట్స్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినిగా కామారెడ్డిలో పనిచేస్తున్న వారి కూతురు కుమారి …

Read More »

వాణిజ్య శాస్త్ర విభాగంలో గంగాదర్‌కు పిహెచ్‌.డి

డిచ్‌పల్లి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వాణిజ్య శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి మాచర్ల. గంగాదర్‌ కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డు ప్రదానం చేయబడిరది. ఆచార్యులు ఎం.యాదగిరి పర్యవేక్షణలో పరిశోధకుడు మాచర్ల. గంగాదర్‌ ‘‘భారత దేశ బ్యాంకింగ్‌ రంగంలో బ్యాంకుల సంయోగం మరియు సంలీనం- భారతీయ స్టేట్‌ బ్యాంకులో అనుబంధ బ్యాంకుల విలీనం ఒక పరిశీలన’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంధాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »