gandari

పోడుభూముల సమస్యపై నిరంతర పోరాటం

గాంధారి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో ప్రధాన సమస్య అయిన పోడుభూములపై పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి అన్నారు. అఖిలపక్షం, టీపీసీసీ పిలుపుమేరకు మంగళవారం గాంధారి మండల కేంద్రంలో నెహ్రు చౌరస్తా వద్ద పోడుభూముల సమస్యలపై ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సుభాష్‌ రెడ్డి మాట్లాడుతూ దళిత గిరిజనుల సమస్యల పరిస్కారం కొరకు కాంగ్రెస్‌ పార్టీ …

Read More »

మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీ

గాంధారి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కులవృత్తుల ఉపాధిలో భాగంగా మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేస్తున్నట్లు గాంధారి ఎంపీపీ రాధా బలరాం నాయక్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయం వద్ద మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలను బెస్త, ముదిరాజ్‌లకు అందజేశారు. మండలం కేంద్రంతో పాటు గండివేట్‌, పొతంగల్‌, ముదెల్లి, సితాయిపల్లి, గౌరారం గ్రామాలలో గల చెరువులలో వదలడానికి 11 లక్షల 74 …

Read More »

యథేచ్ఛగా గంజాయి సాగు

గాంధారి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో గంజాయి సాగు యథేచ్ఛగా కొనసాగుతుంది. మండలంలోని తండాలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా గంజాయి సాగు మాత్రం ఆగడం లేదు. మూడురోజుల క్రితం కాయితి తండాలో గంజాయిని గుర్తించి ధ్వంసం చేసిన అధికారులకు తాజాగా మరో సమాచారం అందడంతో షాక్‌కు గురైయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి… మండలంలోని కొత్తబాది తండాలోని …

Read More »

ఆడపడుచులకు కానుక బతుకమ్మ చీర

గాంధారి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా మీ తోబుట్టువు ముఖ్యమంత్రి కెసిఆర్‌ చీరలను అందిస్తున్నారని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శనివారం గాంధారి మండల కేంద్రంలో ఎంపీపీ రాదా బలరాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమ సమావేశానికి ముఖ్యఅథితిగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌తో …

Read More »

మొక్కలు పరిశీలించిన కేంద్ర బృందం

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జెయింట్‌ సెక్రెటరీ చరణ్‌ జిత్‌ సింగ్‌, డైరెక్టర్‌ ఆర్‌పి సింగ్‌ పరిశీలించారు. మొకరం చెరువులో జరిగిన పూడికతీత పనులను చూశారు. సారవంతమైన మట్టిని తమ పంట పొలాల్లో వేసుకోవడం వల్ల పంట దిగుబడి పెరిగిందని రైతులు తెలిపారు. భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగినట్లు …

Read More »

గాంధారిలో బంద్‌ విజయవంతం

గాంధారి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు చట్టాలకు వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్‌ బంద్‌ గాంధారిలో విజయవంతంగా జరిగింది. రైతు సంఘాలు, అఖిలపక్షం పిలుపు మేరకు ఏఐసీసీ మద్దతుతో నాయకులు బందులో పాల్గొన్నారు. గాంధారిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగింది. ఉదయం నుండి వాణిజ్య, వ్యాపార సముదాయాలు, స్కూల్స్‌, హోటల్స్‌ మూసివుంచారు. బంద్‌ సందర్బంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ రైతు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని అన్నారు. …

Read More »

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

గాంధారి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ తొలి మలి దశ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని సోమవారం గాంధారిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రాధా బలరాం నాయక్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొన్న నేతగా పేరుపొందారని నేతలు కొనియాడారు. …

Read More »

ముగిసిన ఏఎంసీ సభ్యుల పదవీకాలం

గాంధారి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సభ్యుల పదవీకాలం ఈ నెల (సెప్టెంబర్‌) 15 వ తేది నాటికి ముగిసిందని మార్కెట్‌ కార్యాలయ కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు. అప్పటి నుండి మార్కెట్‌ కమిటీ నిర్వహణ బాధ్యతలు నిజామాబాద్‌ జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఎస్‌. గంగు చేపడుతున్నారని అన్నారు. రైతులకు మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో కానీ, ఆవరణలో కానీ ఏమైనా ఇబ్బందులు …

Read More »

గజ్వెల్‌ తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

గాంధారి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీపీసీసీ ఆధ్వర్యంలో గజ్వెల్‌లో నిర్వహిస్తున్న దళిత దండోరా సభకు గాంధారి కాంగ్రెస్‌ శ్రేణులు శుక్రవారం తరలివెళ్లారు. ఉదయం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద బాణాసంచాలు కాల్చిన కాంగ్రెస్‌ నాయకులు నినాదాలు చేస్తూ వాహనాలలో గజ్వెల్‌కు బయలుదేరారు. తరలివెళ్లిన వారిలో మండల కాంగ్రెస్‌ నాయకులు తూర్పు రాజు, బాలరాజ్‌, రవి, లైన్‌ రమేష్‌, కృష్ణ, మదర్‌, సంగని బాబా …

Read More »

ఆదర్శం పవన్‌ యూత్‌

గాంధారి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలానికి చెందిన పవన్‌ యూత్‌ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. మండల కేంద్రంలో యూత్‌ సభ్యులు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. అన్ని వినాయక మండపాల వద్ద నిర్వాహకులు అన్నదానాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ పవన్‌ యూత్‌ సభ్యులు మాత్రం శుక్రవారం అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాదు జిల్లా మోస్రా వద్ద చింతకుంట గ్రామంలో గల అనాధ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »