గాంధారి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక చౌరస్తా వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశం 1947 ఆగస్టు 15 న స్వాతంత్రం పొందినా, తెలంగాణకు నిరంకుశ నిజాం కబంద హస్తాలలో ఉందని అన్నారు. భారతదేశం మొత్తం …
Read More »ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు
గాంధారి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రపంచంలో భారత దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళుతున్న విశ్వవిజేత ప్రధాని మోడీ అని బీజేపీ నాయకులు …
Read More »లబాన్ లంబాడాల పోస్టుకార్డు ఉద్యమం
గాంధారి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర లబాన్ లంబాడాలను ఎస్టి జాబితాలో చేర్చాలని గిరిజనులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్బంగా గాంధారి మండలంలో బుధవారం పలు తండాలలో లబాన్ లంబాడా గిరిజనులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు పంపించేందు పోస్ట్ కార్డులను సేకరించారు. పోస్ట్ కార్డుల రూపంలో తమ విన్నపాన్ని, ఆవేదనను ముఖ్యమంత్రికి చేరేవిధంగా ఒకే సారి కార్డులను పంపిస్తున్నామని లబాన్ లంబాడా …
Read More »పోషకాహారంపై అవగాహన
గాంధారి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలోని బీర్మల్ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషకాహారంపై అవగాహన కల్పించారు. పోషకాహార వారోత్సవాలలో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం వలన కలిగే లాభాల గురించి వివరించారు. పోషకాహార లోపాన్ని నివారించడానికి తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి తెలిపారు. ఈ సందర్బంగా పోషకాహార విలువలు తెలిసే విధంగా మహిళలు వేసిన ముగ్గులు …
Read More »గణేష్ మండపాల వద్ద అన్నదానం
గాంధారి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా మంగళవారం పలు గణేశ్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గాంధారి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గణపతి మండపాల వద్ద అన్నదానం చేపట్టారు. మండల కేంద్రంలోని గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ శంకర్, గణేష్ యూత్ …
Read More »గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
గాంధారి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలో నిర్వహించే గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్థానిక తహసీల్దార్ గోవర్ధన్, సిఐ వెంకట్ మంగళవారం పరిశీలించారు. శని, ఆదివారాలలో నిర్వహించే గణేష్ నిమజ్జనానికి ఏవిదంగా ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకున్నారు. గ్రామంలో తిరిగి రోడ్ల గుంతలను పరిశీలించారు. శోభాయాత్ర వెళ్లే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక అధికారులకు సూచించారు. అలాగే నిమజ్జనం నిర్వహించే స్థానిక వాగు …
Read More »ఫాలిహౌజ్లు పరిశీలించిన ఉద్యానవన జిల్లాధికారి
గాంధారి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలం నేరల్ గ్రామానికి మంజురైన పాలీహౌస్లను మంగళవారం ఉద్యానవన జిల్లాధికారి సంజీవ్ రావు పరిశీలించారు. ఉద్యానవన శాఖ ద్వారా నేరల్ గ్రామానికి 5 ఫాలిహౌజ్ మంజూరు కాగా వాటిని పరిశీలించి సలహాలు సూచనలు చేశారు. గ్రామంలోని సాయిలు, జాదవ్ పూలబాయి, శ్రవణ్, గోపాల్, దేవీసింగ్లకు చెందిన ఫాలిహౌజ్లలో పండిస్తున్న చామంతి తోటలను పరిశీలించారు. ఒక ఎకరం ఫాలిహౌజ్లో …
Read More »సుస్థిర వ్యవసాయంపై అవగాహనా సదస్సు
గాంధారి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుస్థిర వ్యవసాయం ద్వారా పంటలు పండిరచి లాభాలు సాధించిన రైతులకు వ్యవసాయ ఉత్పాదకతలను జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అందించారు. శనివారం గాంధారి మండలం పొతంగల్ గ్రామంలో జాతీయ సుస్థిర వ్యవసాయం 21-22 కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా 6 రైతులను ఎంపిక చేశారు. …
Read More »మహిళా సమాఖ్య పాలకవర్గం ఏర్పాటు
గాంధారి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల నూతన మహిళా సమాఖ్య పాలకవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఐకేపీ కార్యాలయంలో 15 వ వార్షిక మహాసభ సమావేశం నిర్వహించారు. సంవత్సరంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై చర్చించారు. అనంతరం నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా సితాయిపల్లికి చెందిన జ్యోతి, ఉపాధ్యక్షురాలుగా పెట్ సంగం గంగవ్వ, కార్యదర్శిగా నవనీత, సహాయ …
Read More »మానవత్వం మంటకలిసింది
గాంధారి, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవత్వం మంటకలిసింది. అప్పుడే జన్మనిచ్చిన ఓ పండంటి మగశిశువుని ముళ్లపొదల్లో విదిలేసి వెళ్ళింది ఆ తల్లి. కారణం ఆమె అవివాహిత మైనర్ బాలిక కావడమే అని గ్రామస్తుల అనుమానం. వివరాల్లోకి వెళితే గాంధారి మండలంలోని బిర్మల్ తండా గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు బావి వద్ద గల ముళ్లపొదలలో అప్పుడే పుట్టిన మగ శిశువుని గుర్తించిన …
Read More »