బీర్కూర్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి మార్చి 1న సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో వెంకన్న కొండపై జిల్లా అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్. వి పాటిల్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
Read More »బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కంకణబద్దుడనై ఉంటా
బాల్కొండ, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలంలో శుక్రవారం పలు అభివృద్ది పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులతో, గ్రామస్థులు డప్పు చప్పుళ్లతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. చిన్నా పెద్దా అందర్నీ పలకరిస్తూ మంత్రి ముందుకు సాగారు. పురాతన దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహ …
Read More »కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి
గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు రాగా వాటితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గాంధారి మండలంలోని శక్తి కేంద్రాలలో నిర్వహించిన కార్నర్ సమావేశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా మండలంలోని సితాయిపల్లి …
Read More »రికార్డు టైంలో హై లెవెల్ వంతెనల నిర్మాణాలు పూర్తి
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, మోతె గ్రామాల్లో రికార్డు సమయంలో హై లెవెల్ వంతెనల నిర్మాణాలు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం కలిగించిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. వేల్పూర్ పెద్దవాగు పై రూ. 15 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్ …
Read More »ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరిగేలా కృషి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరిగే విధంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం వైద్యులు, ఆరోగ్య ఆశ కార్యకర్తలతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంపుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు చేయించుకునే మహిళలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో …
Read More »ప్రజా పంథానే జనతా ప్రజాతంత్ర విప్లవ మార్గం
రెంజల్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ఉద్యమాల నిర్మాణంతో ప్రజాపంథ మార్గంలోనే జనతా ప్రజాతంత్ర విప్లవం సాధ్యమవుతుందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా సబ్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్ అన్నారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రెంజల్ మండలం తాడ్ బిలోలి, బోర్గం, నీలా గ్రామాల్లో బుధవారం ప్రజాపంథా జండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో అశేష ప్రజానీకాన్ని విప్లవోద్యమంలో …
Read More »ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారం ఉదృతం చేసిన భాజపా
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని విఠలాపురం, ఎల్కూరు, పాలాయి, తాటికుంట, రావులచెరువు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో, మల్దకల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల, జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో బిజెపి బృందం విస్తృతంగా పర్యటించి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవిఎన్ రెడ్డికి ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు …
Read More »జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.
బాన్సువాడ, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 23 నుండి 26 వరకు హైదరాబాద్ నగరంలో జరుగు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 19వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం బాన్సువాడ పట్టణ కార్యాలయంలో జాతీయ మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం రాజుగౌడ్ మాట్లాడుతూ …
Read More »ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని స్పీకర్ పోచారం నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకులతో కలిసి కేక్ కట్చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కొరకు అనునిత్యం పాటుపడుతూ కేవలం ఎనిమిది సంవత్సరాలలోనే రాష్ట్ర భవిష్యత్తును అద్భుతంగా మార్చి రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచారన్నారు. …
Read More »ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు, పోడు పట్టాల పంపిణీ, జీవో నెంబర్ 58, 59, 118 తో పాటు, తెలంగాణకు హరితహారం లాంటి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్ నుండి కలెక్టర్లు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక …
Read More »