Political

29న నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమ కేసులో బీజేపీ పార్టీ ఎన్ని నిర్భంధాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో ప్రజా క్షేత్రంలో పోరాటం సాగిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 29వ తేదీన నిజామాబాద్‌ కు విచ్చేచున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి …

Read More »

పేదలకు అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు

బాన్సువాడ, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్‌ మండల కేంద్రంలో రూ. 1.44 కోట్ల నిధులతో చేపట్టనున్న ప్రాథమిక ఆరోగ్య …

Read More »

అమిత్‌ షాకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ

కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ గురించి రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు …

Read More »

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలోకి..

ఎల్లారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ మాజీ సర్పంచ్‌ కే నర్సా గౌడ్‌, కె మల్లయ్య, కే శ్రీనివాస్‌ గౌడ్‌, కె బాబు, చీనూర్‌ మాజీ ఎఎంసి డైరెక్టర్‌ నారా గౌడ్‌, ఆంజనేయులు, నిఖిల్‌ ధనుష్‌ వెంకటేష్‌ మరియి లింగంపల్లి మాజీ సర్పంచ్‌ కిష్టయ్య, ఆత్మకూర్‌ గ్రామ నాయకులు బి యోహాన్‌, అంతయ్య, సంగమేశ్వర్‌, …

Read More »

విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి..

కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అవినీతి రహిత రాజకీయ వ్యవస్థలు ఏర్పడడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలకు 2024-26 సంవత్సరాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య …

Read More »

నిజామాబాద్‌ జిల్లాను వైద్య సేవల హబ్‌గా తీర్చిదిద్దాలి

నిజామాబాద్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ నిజామాబాద్‌ జిల్లాను వైద్య సేవల హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యాధికారులకు హితవు పలికారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో రూ. 38.75 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎం.సీ.హెచ్‌, క్రిటికల్‌ కేర్‌ యూనిట్లను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభోత్సవాలు …

Read More »

పేదలకు అండగా షబ్బీర్‌ అలీ

కామరెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాల్వంచ మండలం ఫరీద్‌ పేట్‌ గ్రామానికి చేందిన రామయ్య భార్య రాజవ్వ అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్‌ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్‌ నాయకులను సంప్రదించగా వెంటనే మన ప్రియతమా నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీకి విషయం వివరించారు. షబ్బీర్‌ అలీ వెంటనే స్పందించి నిమ్స్‌ హాస్పిటల్‌ డాక్టర్‌తో మాట్లాడి రామయ్య …

Read More »

18న చలో రాజ్‌భవన్‌

కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 18వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో చలో రాజ్‌ భవన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ రావ్‌ తెలిపారు. నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్‌ భవన్‌ వరకు ప్రదర్శనగా వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. …

Read More »

చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు సమయంలో వారి పేరుపై ప్రమాదబీమా, ఎల్‌ఐసి ఇన్సూరెన్స్‌ పాలసీ బిఆర్‌ఎస్‌ పార్టీ తరపున ప్రిమియం కట్టడం వలన కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారికి ఇన్సూరెన్స్‌ కంపెనీ నుండి బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చెక్కు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితం …

Read More »

కవిత బీసీల గురించి మాట్లాడడం హాస్యాస్పదం

నిజామాబాద్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ బీసీలను విస్మరిస్తుందని కవిత మాట్లాడడం హాస్యాస్పదమని కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్‌ గౌడ్‌ అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను వంచించిన పార్టీ బి.ఆర్‌.ఎస్‌ పార్టీ అని తమరి పదేళ్ల పాలనలో రాజకీయంగా ఆర్థికంగా రాష్ట్రంలో బీసీలు వెనుకబడి పోయారని, కేవలం కొంతమందికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »