Political

26 నుండి ఎల్లారెడ్డిలో ‘‘హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర’’

ఎల్లారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివ నగర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వడ్డపల్లి సుభాష్‌ రెడ్డి మాట్లాడారు. రాహుల్‌ గాంధీ దేశంలో కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన ‘‘భారత్‌ జోడో యాత్ర’’కు అనుసంధానంగా రాహుల్‌ గాంధీ సందేశాన్ని నియోజకవర్గంలోని గ్రామ గ్రామానికి పల్లె పల్లెకు …

Read More »

కంటి వెలుగు అద్భుత కార్యక్రమం

వేల్పూర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అక్లూర్‌ గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సోమవారం సందర్శించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన,కంటి పరీక్షలు జరుగుతున్న తీరు, ఎంత మందికి పరీక్షలు చేశారు.ఎంత మందికి అద్దాలు ఇచ్చారు. ఎంత మందికి ఆపరేషన్‌ అవసరం ఉంది …

Read More »

విద్యార్థుల్లో నైపుణ్యాలను గుర్తించడానికి పరీక్ష పే చర్చ

రెంజల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బోధన్‌ నియోజకవర్గ భాజపా సినియర్‌ నాయకులు వడ్డీ మోహన్‌ రెడ్డి, మేడపాటి ప్రకాష్‌ రెడ్డిలు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థుల్లో …

Read More »

అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదు

ఆర్మూర్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతీ బుధవారం స్వచ్చ ఆర్మూర్‌ కార్యాక్రమాన్ని విధిగా నిర్వహించాలని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ బంజారహిల్స్‌ రోడ్‌ నెం.12 లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌ లో ఆదివారం ఆర్మూర్‌ మునిసిపల్‌ పరిధిలో చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానంగా కంటి వెలుగు కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షా …

Read More »

మహిళల సాధికారతతోనే దేశ ప్రగతి నిర్మాణం

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం మహిళల సాధికారతలో మరో మైలురాయిగా స్థిరపడుతుందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధ తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో మహిళ న్యాయమూర్తుల సంఖ్య పెరుగుదల జెండర్‌ వివక్షకు విరుగుడుగా అభివర్ణించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పొలీస్‌ పేరెడ్‌ గ్రౌండ్లో నిర్వహించిన మహిళ సాధికారత సదస్సులో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు. …

Read More »

రైతు బీమా చెక్కు పంపిణీ

మాక్లూర్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం గుంజిలిలో టిఆర్‌ఎస్‌ యువజన నాయకుడు గోపు రంజిత్‌ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రైతు బీమా, సీఎంఆర్‌ చెక్కులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన మహిళా రైతు దుమాల గంగుబాయి ఇటీవల మరణించింది. ఆమె కుటుంబ సభ్యులకు మంజూరైన రూ.5 లక్షల రైతుబీమా చెక్కు అందించారు. అలాగే అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న ఖాసీంబీకి సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.20 వేలు …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్‌ లగ్‌) పరీక్షలో 2465 మంది విద్యార్థులకు గాను 2334 మంది హాజరయ్యారని, 131మంది గైర్‌ హాజరు అయ్యారని కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 4వ సెమిస్టరు బ్యాక్‌ లాగ్‌ వెబ్‌ టెక్నాలజీ పరీక్షలో …

Read More »

రైతుల ఉద్యమం పట్ల స్పందించక పోతే రాజీనామా చేస్తాం

కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ వల్ల నష్టపోతున్న రైతులకు మద్దతుగా, ప్రభుత్వ దోరణిలో నిరసనగా తాము 23 వ తేదీన రాజీనామా చేస్తామని బీజేపీ కౌన్సిలర్‌లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మొటూరి శ్రీకాంత్‌ మాట్లాడుతూ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ వల్ల నష్టపోతున్న రైతులు ఎన్నో ఉద్యమాలు చేసిన అనంతరం స్పందన లేకపోవటంతో …

Read More »

నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు

బోధన్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బోధన్‌ పట్టణ శివారులోని కమ్మ సంఘం భవనంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దంపతులు తూము పద్మావతి,శరత్‌ రెడ్డి నందమూరి అభిమానులు 200 మందికి పైగా …

Read More »

హలొ బీసీ చలో హైదరాబాద్‌

నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసిల పోరుయాత్ర ముగింపు బహిరంగ సభకు ఆదివారం నాయకులు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ చదువు కోసం సామాజిక న్యాయ సాధన కోసం తలపెట్టిన బీసీ పొరుయాత్ర డిసెంబర్‌ 2వ తేది నుండి జనవరి 8 వ తేదీ వరకు పాలమూరు నుండి పట్నం వరకు బిసీల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »