Political

గ్రామాలన్ని తీర్మానించాలని మంత్రి ఆదేశాలు

భీంగల్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.వందల కోట్ల నిధులను ఖర్చు చేస్తూ గ్రామ గ్రామాన నూతనంగా నిర్మిస్తున్న బీ.టీ రోడ్లను పది కాలాల పాటు మన్నికగా ఉండేలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హితవు పలికారు. భీంగల్‌ మండలంలో అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ …

Read More »

రోడ్లను కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిది

ఆర్మూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్లను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ – నందిపేట్‌ ప్రధాన రహదారిలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం బయలు దేరిన జీవన్‌ రెడ్డి రోడ్డుపై వెళ్ళుతున్న కేజ్‌ వీల్‌ ట్రాక్టర్‌ను …

Read More »

రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో యూనియన్‌ సభ్యులు

వేల్పూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామం నుండి పడగల్‌ ఎక్స్‌ రోడ్‌ వరకు అక్కడక్కడ రోడ్డుపై గుంతలు పడడంతో ఈ నెల 18వ తేదీన నడిమోర్రె మూలమలుపు వద్ద రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ఆ సంఘటన అనంతరం ప్రధాన సమస్య రోడ్డుపై గుంతలే కారణమని తెలుసుకున్న ఆటో యూనియన్‌ వారు దాతల సహకారంతో శనివారం …

Read More »

నెల రోజుల్లోగా ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌

ఆర్మూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతో ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ నిర్మాణం పనులను నెల రోజుల్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి వెల్లడిరచారు. ‘‘నమస్తే నవనాధపురం’’ కార్యక్రమంలో భాగంగా శనివారం మాక్లూర్‌ మండలంలోని చిన్నాపూర్‌ గ్రామం వద్ద ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ …

Read More »

ఆర్మూర్‌లో క్రిస్టియన్‌ ఫంక్షన్‌ హాలుకు రూ.50 లక్షలు

ఆర్మూర్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం సర్వమత సామరస్యానికి, సౌబ్రాతృత్వానికి ప్రతీక అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఆర్మూర్‌ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలో జీవన్‌ రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు నూతన దుస్తులను …

Read More »

తెలంగాణలో భవిషత్తు బీజేపిదే

కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ కామారెడ్డి, జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రెమెందర్‌ రెడ్డి మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలనీ, పార్టీకి ఆయువు పట్టు బూత్‌ స్థాయి కార్యకర్తలే అని, వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ …

Read More »

బీజేపీకి తెలంగాణలో చోటు లేదు

ఆర్మూర్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దిక్కూదివాణం లేని పార్టీ అని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌,బీజేపీ నేత జక్కం పొశెట్టితో పాటు మరి కొందరు నాయకులు బిజెపిని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌ బంజారహిల్స్‌ రోడ్‌ నెం.12 లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో …

Read More »

జిల్లా కలెక్టర్‌ను కలిసిన బిజెపి నేతలు

నిజామాబాద్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాత కలెక్టరేట్‌ కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలాన్ని (కలెక్టర్‌ గ్రౌండ్‌) క్రీడా ప్రాంగణానికి కేటాయించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మి నారాయణ జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య మాట్లాడుతూ ఎంఆర్‌వో కార్యాలయ స్థలాన్ని వెజిటేబుల్‌ మార్కెట్‌, ఫిష్‌ …

Read More »

సిద్ధులగుట్టపై రూ.8 కోట్లతో బీటీ రోడ్డు

ఆర్మూర్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ప్రసిద్ధ సిద్ధులగుట్టపై రూ. 8 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి సోమవారం సాయంత్రం సిద్ధులగుట్టను సందర్శించి నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బీటీ రోడ్డు నిర్మాణం పనులను పరివేక్షించిన ఆయన సంబంధిత అధికారులకు …

Read More »

సంకరి నారాయణ రాజీనామా

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాస్టర్‌ ప్లాన్‌ తొలగించాలని డిమాండ్‌ చేస్తూ అడ్లూర్‌ ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్‌ రైతు స్వమన్వయ కమిటీకి సంకరి నారాయణ రాజీనామా చేశారు. ఉద్యమ కాలం నుండి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన సంకరి నారాయణ తనతో పాటు మిగతా రైతుల భూములను ప్రభుత్వం పరిశ్రమల పేరుతో గుంజుకునే ప్రయత్నం చేస్తుందని, తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి బుద్ధి వచ్చి తక్షణమే మాస్టర్‌ ప్లాన్‌ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »