Political

అక్రమ అరెస్టులను ఖండిరచండి

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తూ, ప్రభుత్వం అశాస్త్రీయంగా విడుదల చేసిన జీవో నెంబర్‌ 317 వెనక్కి తీసుకోవాలని గత కొంత కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భీంగల్‌కు చెందిన ఉపాధ్యాయురాలు సరస్వతి నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, మాజీ విప్‌ అనిల్‌, రైతు నాయకులు అన్వేష్‌ …

Read More »

మృత్యుంజయ హోమంలో పాల్గొన్న ఎంపి

కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ్‌లో ప్రధాని ఆరోగ్యం బాగుండాలని బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన మృత్యుంజయ హోమం కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏడున్నర సంవత్సరాల్లో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని, అలాంటి వ్యక్తిని నడిరోడ్డుపై 20 నిమిషాల పాటు ఉంచిన ఘటనపై అక్కడి …

Read More »

రైతుబంధు ప్రపంచానికి ఆదర్శం

బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణ కేంద్రం, దేశాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మొదటగా భాస్కర్‌ రెడ్డి నియోజక వర్గ ప్రజా ప్రతినిదులు, రైతులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, తెలంగాణ రాష్ట్ర శాసన …

Read More »

దోమకొండలో కుల బహిష్కరణ

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కుల బహిష్కరణ చేశారని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, కామారెడ్డి డిఎస్పీలకు ఫిర్యాదు చేశారు. పెరిక కులానికి చెందిన నల్లపు చంద్రం, నల్ల రాజు, నల్లపు నరేష్‌ కుటుంబాలను పెరిక సంఘం నుంచి కుల బహిష్కరణ చేశారని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ సొంత భూమి విషయంలో వివాదం జరిగిందని …

Read More »

రైతుకు ఆర్థిక భరోసా రైతు బంధు పథకం

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుకు పెట్టుబడి సబ్సిడీ కింద అందించే రైతు బంధు పథకం రైతులకు ఆర్థిక భరోసాగా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. రైతుబంధు సంబరాలలో భాగంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటుచేసిన రైతు బందు సంబరాలు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు ద్వారా వానాకాలం యాసంగి …

Read More »

థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఆక్సిజన్‌ సమస్య రాకుండా చర్యలు

మోర్తాడ్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మూడవ వేవ్‌ వచ్చినా ఏ ఒక్క పేదవాడు కూడా ఆక్సిజన్‌ దొరక్క ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పలు మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలు ఐసియు బెడ్స్‌ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం మోర్తాడ్‌ మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో …

Read More »

ముఖ్యమంత్రి, మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు

ఆర్మూర్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై, రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావుపై చట్టరీత్య కేసులు నమోదు చేయాలని కోరుతూ ఆర్మూర్‌ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి పోలీసు కార్యాలయానికి వెళ్లి ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సైదయ్యకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్‌ కుమార్‌, …

Read More »

రైతుబంధు వచ్చే, సంబురం తెచ్చే

బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా సోమేశ్వర్‌లో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసారు. అనంతరం రైతులను ఉద్దేశించి భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ సోమేశ్వర్‌ గ్రామంలోని …

Read More »

రాజంపేటలో సావిత్రిబాయి జయంతి వేడుకలు

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలం శివాయిపల్లిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పూలమాలలు వేశారు. సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విట్టల్‌ రెడ్డి, జెడ్‌పిటిసి సభ్యుడు హనుమాన్లు, ఎంపీడీవో బాలకిషన్‌, తాసిల్దార్‌ జానకి, ఎంపీటీసీ సభ్యుడు బాల్‌రాజ్‌ గౌడ్‌, …

Read More »

బరువు తక్కువ ఉన్న పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించాలి…

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలం శివాయిపల్లిలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. అంగన్‌వాడి కేంద్రంలో బరువు తక్కువ ఉన్న పిల్లలకు అదనంగా పౌష్టికాహారం అందించాలని అంగన్‌వాడీ కార్యకర్తకు సూచించారు. ప్రాథమిక పాఠశాలలో వంటశాలగది శిథిలావస్థలో ఉన్నందున మరమ్మతులు చేయించాలని ఎంపిడిఓ బాలకిషన్‌ను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుల పిల్లలు చదువుతున్నారని గ్రామస్తులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »