నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ నగరం అతలాకుతలం అయింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవిత నేనున్నానంటూ వరద బాధితులకు తన ఆపన్న హస్తాన్ని అందించారు. గంగస్థాన్ ఫెసు 2 పరిధిలోని వాగు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న బాధితుల ఆకలి తీర్చిన కవిత గురువారం 150 మంది బాధిత కుటుంబాలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ …
Read More »గుంతలు పూడ్చాలని గుంతలో కూర్చుని నిరసన
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రోడ్ల గుంతలు పూడ్చాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లా రోడ్డులో పెట్రోల్ పంపు ముందు గల గుంతలో కూర్చొని గంట పాటు జల దీక్ష చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు విపుల్ జైన్ మాట్లాడుతూ పేరుకు జిల్లా కేంద్రం తప్ప కామారెడ్డిలో గత 7 …
Read More »ఇక్కడ సమస్యలు… ఢిల్లీలో సంబరాలు…
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్లూర్ గ్రామానికి చెందిన అధికార తెరాస పార్టీకి చెందిన మాజీ కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ హఫీజ్, మాజీ గ్రామ తెరాస అధ్యక్షుడు మేడిపల్లి నర్సింలు, తెరాస సీనియర్ నాయకులు మహేందర్, రాంరెడ్డి, రాజు, శ్రీనివాస్,అనిల్, రమేష్, రాజాగౌడ్, రాజశేఖర్లతో పాటు ఆరుగురు యువకులు బిజెపి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా …
Read More »ఆలూరు గ్రామంలో తెరాస గ్రామ కమిటీల ఏకగ్రీవ ఎన్నిక…
ఆర్మూర్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రేగుల్ల రజినీకాంత్, మహిళ విభాగం అధ్యక్షులుగా మీర గంగా, రైతు విభాగం అధ్యక్షులుగా మామిడి రాంరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులుగా పిట్టెల అఖిల్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా జాప సంతోష్, బీసీ …
Read More »బిజెపిలో చేరిన దోమకొండ యువకులు
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన 154 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని దొర పాలనకు అంతం పలకాలని అన్నారు. ప్రజల పక్షాన పోరాటానికి బీజేపీ రాష్ట్ర రథసారథి …
Read More »తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా జ్ఞానేశ్వరి
కామారెడ్డి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ గురువారం నియామక పత్రాన్ని అందజేశారు. జ్ఞానేశ్వరి కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి, రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ …
Read More »బిజెపిలో చేరిన రెంజర్ల యువకులు
ముప్కాల్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర యువనాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు, పటేల్స్, రజక యూత్ సభ్యులు మొత్తం 100 మంది భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. వీరికి మల్లికార్జున్రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీను, మండల అధ్యక్షులు గిరి …
Read More »కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు అరవింద్కు లేదు
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపి అరవింద్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అరవింద్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్, టి.పి.సి.సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై …
Read More »ఎంపి అరవింద్ను కలిసిన కుల సంఘాల ప్రతినిధులు
నిజామాబాద్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్లోని పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ను కలిశారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు వారి వారి కమ్యూనిటీ హాలులకు సంబంధించిన ఆర్థిక నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్నురు కాపు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్, విశ్వబ్రాహ్మణ …
Read More »ప్రారంభానికి సిద్ధం.. విద్యార్థులకు స్వాగతం…
వేల్పూర్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో కరోణ వైరస్ కారణంగా పాఠశాలలు మూసివేసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాలమేరకు సెప్టెంబర్ ఒకటి నుండి పాఠశాలలను ప్రారంభం చేసేందుకు అధికారులు, ఉపాధ్యాయబృందం ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థిని విద్యార్థులు చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Read More »