నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపి అరవింద్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అరవింద్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్, టి.పి.సి.సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై …
Read More »ఎంపి అరవింద్ను కలిసిన కుల సంఘాల ప్రతినిధులు
నిజామాబాద్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్లోని పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ను కలిశారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు వారి వారి కమ్యూనిటీ హాలులకు సంబంధించిన ఆర్థిక నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్నురు కాపు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్, విశ్వబ్రాహ్మణ …
Read More »ప్రారంభానికి సిద్ధం.. విద్యార్థులకు స్వాగతం…
వేల్పూర్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో కరోణ వైరస్ కారణంగా పాఠశాలలు మూసివేసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాలమేరకు సెప్టెంబర్ ఒకటి నుండి పాఠశాలలను ప్రారంభం చేసేందుకు అధికారులు, ఉపాధ్యాయబృందం ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థిని విద్యార్థులు చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Read More »వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి…
కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది, ఇక ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ చక చక పావులు కదుపు తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం …
Read More »రేవంత్ రెడ్డి జోలికి వస్తే ఊరుకునేది లేదు
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిజామాబాద్ ఎన్ఎస్యుఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేసి అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఎన్. ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ …
Read More »వైఎస్ఆర్టిపి జెండా ఆవిష్కరణ
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ప్రాంతంలో వైఎస్ఆర్టిపి పార్టీ జండాను సయ్యద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పార్టీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కో కన్వీనర్ బుస్సాపూర్ శంకర్ హాజరై మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణా పార్టీకి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలో వచ్చే విధంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 8 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 3 లక్షల 11 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 901 మందికి 5 కోట్ల 51 లక్షల 78 వేల 400 రూపాయల చెక్కులను …
Read More »కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుచేయాలి
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర సదస్సు పోస్టర్లను తెలంగాణ ప్రగతిశీల బార్ అండ్ రెస్టారెంట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో తిలక్ గార్డెన్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు టి.విఠల్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రజలను యువతను దేశ భక్తి పేరుతో మాయమాటలు చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికే పనిచేస్తుందన్నారు. మోడీ సర్కారు ఇటీవల …
Read More »శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు
వేల్పూర్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో వర్షరుతువు దక్షిణాయన అభిజిత్ ముహూర్తం కృష్ణ పాడ్యమి శ్రావణమాసంలో పార్ణమి తర్వాత వచ్చే తొలి శ్రావణ సోమవారం శ్రీ రాజ రాజేశ్వరీ స్వామి శివాలయంలో అయ్యల గుట్ట స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు స్వామి మాట్లాడుతూ గత కొంత కాలంగా కొనసాగుతున్న శ్రావణమాస ఉపవాస దీక్షలు …
Read More »జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు కుక్కునూరు విద్యార్థి
వేల్పూర్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు వేల్పూర్ మండలం కుక్కునూరు జడ్.పి.హెచ్ఎస్ పాఠశాల విద్యార్థి కె.మయూరి ఎంపికయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ, ఉపాధ్యాయబృందం తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో జరిగిన క్రికెట్ పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. సెప్టెంబర్ 4,5,6 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో …
Read More »