కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఎస్ బి పాస్ క్రింద ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఉన్న లే అవుట్లకు 21 రోజులలోగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లే అవుట్ కమిటీ సమావేశంలో సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిబంధనల మేరకు లే అవుట్లు …
Read More »ఇంటర్ సప్లిమెంటరీలో 58.39 శాతం ఉత్తీర్ణత
నిజామాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023-24 విద్యా సంవత్సరానికి గాను గత మే నెలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలలో మొదటి సంవత్సరం లో 58.39 శాతం విద్యార్థులు పాస్ కాగా బాలికలదే పై చేయిగా నిలిచిందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి టి. రవికుమార్ తెలిపారు. సోమవారం విడుదలైన సప్లిమెంటరీ ఫలితాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 58.39 శాతం ఉత్తీర్ణత కాగా రెండవ …
Read More »రైతు పక్షపాతి షబ్బీర్ అలీ..
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామరెడ్డి జిల్లాకు సాగు నీరు అందించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 20,21,22 ప్యాకేజీ పెండిరగ్ పనులపై ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం హర్షణీయమని మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రైతులకు రెండు లక్షల 75,000 …
Read More »మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి జిల్లా అని, ఇక్కడి ప్రజలు కుల,మతాలకతీతంగా సుహృద్భావ వాతావరణంలో పండుగలు జరుపుకునే సంప్రదాయం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ సింధు శర్మతో కలిసి పాల్గొన్నారు. …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని …
Read More »విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్య ద్వారానే సమాజంలో వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 3, 5 ,8 వ తరగతుల్లో గిరిజన బాలురు, బాలికల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కీ …
Read More »దండాలయ్యా..! మా వెంటే నువ్వు ఉండాలయ్యా!!
గాంధారి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుపేద కుటుంబం ఇంటి నిర్మాణానికి తన మొదటి జీతం 4 లక్షలను ఎల్లారెడ్డి ఎంఎల్ఏ మదన్ మోహన్ విరాళంగా అందజేశారు. గాంధారి మండలం సర్వపూర్ గ్రామంలో దొంతులల బోయిన వెంకట్ (42) ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. వెంకట్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, వారి కుటుంబ పరిస్థితి …
Read More »కుళాయిల సమగ్ర సర్వే సజావుగా చేపట్టాలి
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామపంచాయతీలో కుళాయిల సమగ్ర సర్వే పంచాయతీ కార్యదర్శులు సజావుగా చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ రేట్లు సోమవారం పంచాయతీ కార్యదర్శులకు మిషన్ భగీరథ నీరు అందే సమగ్ర వివరాలను సేకరించే విధానంపై శిక్షణ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ …
Read More »వ్యాపారిని బెదిరించిన అపరిచితుడు
బాన్సువాడ, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అప్నా బజార్ యజమాని నటరాజ్కు శుక్రవారం బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నానని ఒక వ్యక్తి పరిచయం చేసుకొని వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్ ఐదు సంవత్సరాల ఫీజు 9990 రూపాయలు కట్టాలని చెప్పడంతో అనుమానం వచ్చిన యజమాని మున్సిపల్ కమిషనర్ యొక్క నంబరు తెలుసుకొని ఇది బోగస్ ఫోన్ అని గమనించి ఫోన్ లో ఉన్న అతనికి …
Read More »అభ్యర్థుల హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టిక్కెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఐడెంటిఫికేషన్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 09న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట …
Read More »