Blog Layout

బూత్‌ లెవల్‌ అధికారులకు ముఖ్య గమనిక

కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బూతు లెవల్‌ అధికారుల వద్ద సమగ్ర సమాచారం ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం ఏఆర్‌ఓల మాస్టర్‌ ట్రేనర్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. బూతు లెవెల్‌లో ఉన్న ఓటర్ల సంఖ్య, పురుషులు, మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్స్‌ ఎంతమంది ఉన్నారనే …

Read More »

టియు లైబ్రరీకి గ్రంథాల వితరణ

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సంపూర్ణ వాక్‌ మవ్‌ అనే హిందీ భాషా గ్రంధ ఖండిరకలును హిందీ విభాగ పి.హెచ్‌.డి పరిశోధక విద్యార్థి ప్రకాష్‌ తెలంగాణ విశ్వవిద్యాలయ లైబ్రరీకి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ వర్సిటీ సెంటర్‌ లైబ్రరీకి అత్యంత విలువైన ఈ గ్రంథాలు అందించడం అభినందనీయమని …

Read More »

నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు 16, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంశ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : చవితి రాత్రి 10.57 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.31 వరకుయోగం : ధృవం ఉదయం 10.32 వరకుకరణం : వణిజ ఉదయం 11.26 వరకు తదుపరి భద్ర రాత్రి 10.57 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.17 …

Read More »

సీఎంసీ, ఆర్‌.కె కళాశాలలను సందర్శించిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్పల్లిలోని సీ.ఎం.సీ కళాశాల, బోధన్‌ పట్టణంలోని ఆర్‌.కె ఇంజనీరింగ్‌ కాలేజీలను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ లు సందర్శించారు. సమీప భవిష్యత్తులో జరుగనున్న నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు అనువైన భవనాలను పరిశీలించడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కలెక్టర్‌ గురువారం బోధన్‌ లోని …

Read More »

నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ బడులలో మెరుగైన ఫలితాల సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ నిర్ణీత లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేనతో కలిసి శుక్రవారం ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. వివిధ జిల్లాలలో ప్రాథమిక, …

Read More »

సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలి..

బాన్సువాడ, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా ఆల్‌ ఇండియా గ్రామీణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ పిలుపుమేరకు బాన్సువాడ తపాలా శాఖ ఉద్యోగులు కార్యాలయం ముందు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపాలా ఉద్యోగులకు ఎనిమిది గంటల పని, పెన్షన్‌తో సహా అన్ని ప్రయోజనాలు …

Read More »

దివ్యాంగులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

కామరెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి బావయ్య అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు వివిధ క్రీడా పోటీల విజేతలకు శుక్రవారం బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి బావయ్య మాట్లాడారు. ప్రతి …

Read More »

రోడ్డున పడ్డం సారూ….

కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏంటో గాని ఆటో డ్రైవర్లము రోడ్డుపైన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి ఆడవాళ్లకు బస్సులో ఉచిత ప్రయాణంను మేము …

Read More »

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్‌ కళాశాల సమావేశమందిరంలో సైబర్‌ సురక్షిత- జాతీయ భద్రతా అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్స్పెక్టర్‌ కె. కృష్ణ మాట్లాడుతూ మితిమీరిన స్మార్ట్‌ ఫోన్ల వినియోగం అలవాటుగా మారి, వ్యసనంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇది శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, మానసిక చికాకులు, మనోవ్యాదులు …

Read More »

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీపీ

బాన్సువాడ, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం అమలు తీరును ఎంపీపీ రఘు, ఎంపీడీవో భానుప్రకాష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెను ప్రకారం కూరగాయలు పెట్టకుండా నీళ్లచారు, సాంబారు వడ్డించడంపై సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో భోజనం సరిగా ఉండకపోవడంతో విద్యార్థులు ఇంటి నుంచి లంచ్‌ బాక్సులు తీసుకొని రావడంతో ఎంపీపీ ఎంపీడీవో విద్యార్థులను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »