కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 5 నుండి 25 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో అన్ని …
Read More »Blog Layout
25 వ సారి రక్తదానం చేయడం అభినందనీయం..
కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న నర్సింగరావు (78) ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. భిక్కనూర్ మండలం లక్ష్మీ దేవునిపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి …
Read More »సాలుర పీ.హెచ్.సీని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను గమనించారు. రోగులను …
Read More »నేటి పంచాంగం
శనివారం, మార్చి.1, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ తెల్లవారుజామున 3.17 వరకువారం : శనివారం (స్ధిరవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర మధ్యాహ్నం 2.06 వరకుయోగం : సాధ్యం రాత్రి 7.16 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.22 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.17 వరకు వర్జ్యం : రాత్రి 10.59 – 12.29దుర్ముహూర్తము : ఉదయం 6.22 …
Read More »ఇంటర్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీసు ఉన్నత అధికారులు, జిల్లా …
Read More »విద్యార్థులతో లెక్కలు చేయించిన కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా హార్డ్ వర్క్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి భిక్కనూరు ప్రభుత్వ సాంఫీుక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. తొలుత కలెక్టర్ కు ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. పదవతరగతి విద్యార్థులను మాథ్స్లో లెక్కలను బోర్డు పై చేయించి …
Read More »టియులో సివి రామన్ జన్మదిన వేడుకలు
డిచ్పల్లి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్లో సివి రామన్ జన్మదిన వేడుకలు ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించవలసింది మానవ కల్యాణానికే కానీ మారణ హోమానికి కాదని సివి రామన్ తెలిపారని కొనియాడారు. విశ్వవిద్యాలయాలు లోతైన శాస్త్రీయ పరిశోధన నిర్వహించి సమాజానికి దిక్సూచిగా పనిచేయాలన్నారు. …
Read More »విద్యాశాఖాధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్టుమెంటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12-30 …
Read More »ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని, పనులు మంజూరై ప్రారంభించని వాటిని కన్వర్ట్ చేస్తూ సి సి రోడ్లు నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం అధికారులతో కలిసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, సమగ్ర కుటుంబ సర్వే, గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల వసూళ్లు, ఎల్.ఆర్.ఎస్., త్రాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇండ్లు అంశాలపై ఎంపీడీఓలు, …
Read More »పీ.హెచ్.సీని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రమైన మాక్లూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలియాతండాలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి …
Read More »