కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మునిసిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, …
Read More »Blog Layout
కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం అమలు తీరును నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు.శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్ సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ పథకంతో పాటు …
Read More »చీడపీడలు, తెగులు నివారణపై రైతులకు అవగాహన
గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల పరిధిలోని గండివెట్ గ్రామములో రైతులకు యూరియా వాడకంపై మరియు వివిధ చీడపీడల, తెగులు నివారణపై శుక్రవారం మండల వ్యవసాయ అధికారి అవగాహన కల్పించారు. పంట పొలాల్లో యూరియా అధికంగా వాడితే తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, అదే విధంగా తెగుళ్ల నివారణ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి రైతులు తగినంత యూరియా మత్రమే వాడాలని సూచించారు. …
Read More »ఉద్యోగులు సమిష్టిగా అభివృద్ధికి కృషి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగులు సమిష్టిగా పనిచేసి కామారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల, పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం టీజీవో ఆధ్వర్యంలో 2023 డెఈరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సామాజిక సేవా కార్యక్రమాలలో గెజిటెడ్ ఉద్యోగులు ముందంజలో ఉండాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర …
Read More »ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జీతభత్యాలు, పదోన్నతులు వంటి అనేక విషయాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు మొదలుకుని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వరకు ప్రతి ఉద్యోగి సాధకబాధకాలను గుర్తెరిగిన ముఖ్యమంత్రి …
Read More »మామిడిపల్లి హైస్కూల్లో క్షయ వ్యాధిపై అవగాహన
ఆర్మూర్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి హైస్కూల్లో శుక్రవారం విద్యార్థులకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి పర్యవేక్షకులు సంతోష్ మాట్లాడుతూ క్షయ లేదా టి.బి. అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటు వ్యాధి, టిబి బాక్టీరియం సాధారణంగా దగ్గు మరియు తుమ్ముల సమయంలో గాలిలోకి విడుదలయ్యే చిన్న బిందువుల ద్వారా …
Read More »కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి
గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు రాగా వాటితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గాంధారి మండలంలోని శక్తి కేంద్రాలలో నిర్వహించిన కార్నర్ సమావేశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా మండలంలోని సితాయిపల్లి …
Read More »విద్యార్థులు సోషల్ అవేర్నస్ కలిగి వుండాలి
గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులు సోషల్ అవేర్నస్ కల్గివుండాలని ఎఫ్ఎల్ఎన్ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడిరది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పాఠశాలను స్టేట్ టీం సందర్శిస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా శుక్రవారం గాంధారి మండలంలోని జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలను సందర్శించిన రాష్ట్ర కమిటీ విద్యార్థులతో మాట్లాడారు. రాష్టంలో విద్యాశాఖ నూతనంగా అమలు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా …
Read More »నిందితుడిని కఠినంగా శిక్షించాలి
గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్యావిద్యను అభ్యశిస్తున్న దరావత్ ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నిందితుడు సైఫ్ను కఠినంగా శిక్షించాలని ఎల్లారెడ్డి గోర్ సేనా ఇంచార్జి లక్ష్మణ్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గాంధారి తహసీల్దార్ గోవర్ధన్కు గోర్ సేనా తరుపున వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని నిందితుడిని కఠినంగా శిక్షిస్తే భావితరాలకు ఉపయోగకరంగా …
Read More »మంజీర డిగ్రీ కళాశాలలో రిక్రూట్మెంట్ డ్రైవ్
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల మంజీర డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శనివారం టాస్క్ సహకారంతో ప్రముఖ ఎంఎస్ఎన్ లాబొరేటిరీస్ కార్పొరేట్ కంపెనీలో 100 ఉద్యోగాలకు బీఎస్సీ, బీకాం, బి.ఎ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి నిరుద్యోగులందరికీ రిక్రూమెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ గురువేందర్ రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు తమ యొక్క …
Read More »