నిజామాబాద్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారులను జైలుకి పంపడం జరుగుతుందని, వాహనదారులు ఇది గమనించాలని నిజామాబాద్ పోలీసు కమిషనర్ పి.సాయిచైతన్యఅన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం మద్యంసేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి జైలుశిక్ష, 21 మందికి జరిమానాలు విధించినట్టుపేర్కొన్నారు. 6వ తేదీ మంగళవారం నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీసు స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారిగా …
Read More »Blog Layout
విద్యుత్ ఘాతంతో గేదెలు మృతి
జగిత్యాల, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయ్య పల్లిలో మంగళ వారం ఉదయం నాలుగు గేదెలు (బర్రెలు) విద్యుత్ షాక్తో మృత్యు వాత పడ్డాయి. గేదెలను మంగళ వారం ఉదయం మేత కోసం మందకు తోల్క పోంగా చిన్నాపూర్ శివారులోని ఎనగంటి మల్లేశం పొలం వద్ద తెగి పడిన విద్యుత్ తీగలతో కరెంటు షాక్ తగిలి నాలుగు గేదెలు అక్కడికక్కడే …
Read More »డిగ్రీ పరీక్షల షెడ్యూలు విడుదల
డిచ్పల్లి, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్ రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్, బ్యాక్లాగ్ ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 14 నుండి ప్రారంభమవుతాయని పరీక్షలకు 11,617 విద్యార్థులు 32 సెంటర్లలో హాజరవుతారని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య.కే. సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
నిజామాబాద్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో తూకం జరిపించి, నిర్ణీత రైస్ మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మాక్లూర్ మండలంలోని మాదాపూర్, మాక్లూర్ లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, మే.6, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం -వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 12.03 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మఖ సాయంత్రం 6.59 వరకుయోగం : ధృవం తెల్లవారుజామున 3.17 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.03 వరకుతదుపరి తైతుల రాత్రి 12.22 వరకు వర్జ్యం : ఉదయం 6.33 – 8.12 మరల తెల్లవారుజామున 3.27 – …
Read More »ఉతీర్ణత సాధించిన విద్యార్థులకు సన్మానం
నందిపేట్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని అయిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాసిన 44 విద్యార్థులు ఉతీర్ణత సాధించినందుకు వారిని సోమవారం గ్రామాభివృద్ధి కమిటీ సన్మానించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాలయ్య, మురళి, సదానందం సహోపాధ్యాయులను కమిటీ తరపున పోగుల గంగాధర్, మీసాల సుదర్శన్, సుబ్బారావు, మంగలి గంగాధర్ ఇతర సభ్యులు వారిని సన్మానించారు. లయ (566), సాదియాబేగం …
Read More »ప్రజావాణికి 117 ఫిర్యాదులు
నిజామాబాద్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 117 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లతో పాటు జడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఇంచార్జి …
Read More »కామారెడ్డి ప్రజావాణిలో 96 ఫిర్యాదులు
కామారెడ్డి, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి లో (96) ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని …
Read More »సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ
హైదరాబాద్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని సోమవారం ఉదయం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నమనేని …
Read More »గుర్తింపులేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించొద్దు
కామారెడ్డి, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపు లేకున్నా తమ పాఠశాలకు గుర్తింపు ఉందని చెప్పుకుంటూ విద్యార్థులను స్కూల్లో చేర్పించుకుంటున్నారని , విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించే ముందు ఆ పాఠశాలకు గుర్తింపు ఉందా లేదా సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రుల పైన ఉందని కామారెడ్డి మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య అన్నారు. ఈ …
Read More »