Blog Layout

రోడ్డు ప్రమాదాల నివారణకు స్వీయ నియంత్రణ తప్పనిసరి

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపును పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా పోలీస్‌ శాఖ సౌజన్యంతో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అన్ని శాఖల అధికారులు, …

Read More »

జాతీయవాదమే మాకు ప్రాణప్రదం

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వార్షిక క్యాలెండర్లో వార్షిక ప్రగతి ప్రణాళికలు ఉంటేనే వాటికి సార్ధికత లభిస్తుందని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ అన్నారు. న్యాయవాద పరిషత్‌ రాష్ట్ర కమిటీ రూపొందించిన 2025 వార్షిక క్యాలెండర్‌ ను జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌లో పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. నరేందర్‌ రెడ్డి, సభ్యులు దయావార్‌ నగేష్‌, …

Read More »

యువ గర్జన పోస్టర్ల ఆవిష్కరణ

ఆర్మూర్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని వ్యవసాయ శాఖ మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ మాదికులకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మాదిగ విద్యార్థి గర్జన పోస్టర్లను, కమిటీ చైర్మన్‌ సాయిబాబాగౌడ్‌తో పాటు ఎంఆర్పిఎస్‌ నాయకులు పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా ఇన్చార్జ్‌ అవార్డు గ్రహీత మోతే భూమన్న మాట్లాడుతూ మాదిగ నవ …

Read More »

పిహెచ్‌సి, పాఠశాలలు తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం ఆయన జక్రాన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. పీ హెచ్‌ సిలోని …

Read More »

యంత్రాల ద్వారా సులభ చెల్లింపులు

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీ నిధి ఋణాలు పారదర్శకంగా పాస్‌ మిషన్స్‌ ద్వారా తిరిగి వసూళ్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌లో పాస్‌ మిషన్స్‌ లను స్లం (ఏరియా లెవెల్‌ ఫెడరేషన్‌) సమైఖ్య ప్రతినిధులకు కలెక్టర్‌ అందజేశారు. రాష్ట్రంలోని మొదటి సారిగా స్లం సమైఖ్య ప్రతినిధులకు అందజేయడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సందర్భంగా …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జనవరి.31, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ సాయంత్రం 4.18 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 8.09 వరకుయోగం : వరీయాన్‌ సాయంత్రం 6.11 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.18 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 3.24 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.02 – 4.34దుర్ముహూర్తము : ఉదయం 8.51 …

Read More »

హామీలు వెంటనే అమలుపర్చాలి

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్‌ ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్‌ ఆవరణలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు …

Read More »

విఆర్‌ కె విద్యార్థులకు స్పీకింగ్‌ స్కిల్స్‌ ప్రాక్టీస్‌ సెషన్‌

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక వి ఆర్‌ కే జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ని పెంపొందించడానికి ఇంగ్లీషులో జస్ట్‌ ఎమినిట్‌ జామ్‌ రౌండు ప్రాక్టీస్‌ సెషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తగు సూచనలు చేసి సమర్థవంతంగా మాట్లాడేలా విషయం పైన అవగాహన కలిగించారు. అనంతరం ప్రతి విద్యార్థి వారు ఎంచుకున్న అంశంలో ఒక్క నిమిషం పాటు తడబడకుండా మాట్లాడేలా …

Read More »

పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌పల్లి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బిఎడ్‌ రెండవ సంవత్సరపు మూడో సెమిస్టర్‌ ( రెగ్యులర్‌) చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు ఫిబ్రవరి 8వ తేదీ వరకు చెల్లించ వచ్చునని, 100 రూపాయల పరాధ రుసుముతో 10వ తేదీ వరకు చెల్లించ వచ్చునని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం అరుణ ఒక ప్రకటనలు తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ …

Read More »

స్వాతంత్రోద్యమ అమరవీరులకు ఘన నివాళులు

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ సారథ్యంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »