ఆర్మూర్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య ఉపకేంద్రం ఆలూర్ ఆధ్వర్యంలో సోమవారం స్పర్శ లెప్రసీ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఆరోగ్య పర్యవేక్షకులు సుభాష్ మాట్లాడుతూ 30 జనవరి 2023 నుండి 13 ఫిబ్రవరి 2023 వరకు లెప్రసీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధి నిర్ధారణ చేసి వారికి తగు మందులను ఇవ్వబడుతుందని తెలిపారు. లెప్రసి వ్యాధిని గుర్తించడానికి …
Read More »Blog Layout
సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించిన సర్పంచ్
రెంజల్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ ఎస్సీ కాలనీలో సోమవారం సర్పంచ్ వికార్ పాషా, ఎంపీటీసీ అహ్మద్ సిసి డ్రైనేజీ పనులను ప్రారంభించారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధుల ద్వారా మంజూరైన రూ.5 లక్షలతో పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లతా సాయిలు, వార్డు సభ్యులు కంఠం గంగారాం, సురేష్, పోసాని, బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు …
Read More »ప్రభుత్వ తీరును ఎండగట్టెందుకే హాత్ సే హాత్ జోడు యాత్ర
రెంజల్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అన్నారు. సోమవారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హత్ సే హత్ హాజో కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ …
Read More »ఫిర్యాదులు పెండిరగ్ ఉండకూడదు
నిజామాబాద్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, ఏ ఒక్క అర్జీ కూడా పెండిరగ్ లో ఉండకూడదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 109 ఫిర్యాదులు అందాయి. …
Read More »విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరుచుకోవాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ 2,3,4 ప్రత్యేక ఫౌండేషన్ కోర్స్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రణాళిక బద్ధంగా విద్యార్థులు …
Read More »ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. వాటిని సంబంధిత …
Read More »జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చిన్నారి దత్తత
నిజామాబాద్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పాపని దత్తత ఇవ్వడం జరిగింది. సోమవారం స్థానిక ఐడిఓసిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ఐదు సంవత్సరాల పాపని జర్మనీ దేశానికి సంబంధించిన తల్లిదండ్రులకి దత్తత ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్న భార్యాభర్తలని అభినందించారు. పాపని జాగ్రత్తగా చూసుకోవాలని మంచి పౌష్టికాహారం, విద్య …
Read More »పేదప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం
కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపూర కాలనీలో షబ్బీర్ అలీ ఫౌండేషన్, సహాయత ట్రస్ట్ ఇండో యుఎస్ ఆస్పత్రి సౌజన్యంతో అమెరికా ప్రసిద్ధ, హైదరాబాద్ చెందిన 30 మంది వైద్య బృందంతో నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలి షబ్బీర్ మాట్లాడారు. కామారెడ్డి పట్టణంతోపాటు పలు గ్రామలలోని నీరు …
Read More »చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
ఎడపల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లి మండలంలోని జమ్లం గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని జమ్లం గ్రామానికి చెందిన ఎరువల్లి గంగాధర్ (40) గత కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 1న రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని పోలీసులు …
Read More »ఘనంగా లక్ష్మీ నరసింహస్వావి రథోత్సవం….
ఎడపల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య యజ్ఞ యాగాదులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తులను రథంపై ఉంచి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం …
Read More »